భారత్ ఆస్ట్రేలియాల మధ్య అత్యంత ఆసక్తికరంగా సాగిన జైపూర్ వన్డే పలు రికార్డులకు వేదికయ్యింది. భారత్ పై ఆస్ట్రేలియా అత్యధిక పరుగుల లక్ష్యాన్ని విధిస్తే, దాన్ని అధిగమించి అత్యధిక లక్ష్య చేధన రికార్డును లిఖించింది టీమిండియా. ఇక వ్యక్తిగత రికార్డుల విషయానికి వస్తే....
- 52 బంతుల్లోనే సెంచరీ చేసిన కోహ్లీ, అత్యంత వేగంగా సెంచరీ చేసిన భారత క్రికెటర్ గా రికార్డు కెక్కాడు.
- కోహ్లీ సెంచరీ ప్రపంచ వన్డే క్రికెట్ లో ఏడో వేగవంతమైన సెంచరీ
- భారత్ కు వన్డే క్రికెట్ లో ఇదే అత్యధిక లక్ష్య చేధన
- అత్యధిక లక్ష్య చేధన జాబితా చూస్తే, మొదటి నాలుగు స్థానాల్లో ఉన్న మ్యాచుల్లో పరాజయం పాలైన జట్టు ఆస్ట్రేలియానే.
- ఆస్ట్రేలియాపై 360 పరుగుల లక్ష్యాన్ని అందుకున్న టీమిండియా, రెండో అతిపెద్ద లక్ష్య చేధన రికార్డును సొంతం చేసుకుంది. (మొదటిది ఆస్ట్రేలియాపై 438 పరుగుల లక్ష్యాన్ని చేధించినందుకు దక్షిణాఫ్రికా పేరిట ఉంది.)
- మొదటి ఐదుగురు బ్యాట్స్ మెన్ హాఫ్ సెంచరీలు చేయడం క్రికెట్ చరిత్రలోనే తొలిసారి. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ ఈ రికార్డును దక్కించుకున్నారు.
16, అక్టోబర్ 2013, బుధవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి