రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఆమరణ దీక్షకు దిగుతున్నట్లు ప్రకటించారు వైసీపీ అధ్యక్షుడు జగన్. అసెంబ్లీని పక్కన పెట్టి, రాష్ట్ర విభజనకు కేంద్రం తీసుకున్న నిర్ణయం ఆవేదన కలిగిస్తోందన్న ఆయన.. పార్టీ కార్యాలయం దగ్గరే దీక్ష చేపడతానన్నారు. రాష్ట్ర విభజనపై కేంద్రం పునరాలోచించాలని ఆయన కోరారు. కృష్ణా జలాలు ఇప్పటికే సరిగ్గా రావడం లేదని, రేపు తెలంగాణ ఏర్పడితే నాగార్జున సాగర్ కు నీళ్లు ఎలా వస్తాయని ఆయన ప్రశ్నించారు. ట్రిబునల్స్ ఉన్నా, ఇప్పుడే రాష్ట్రానికి సరిగ్గా నీళ్లు అందడం లేదని, విభజన జరిగిన తర్వాత కూడా ఇదే పరిస్థితి ఏర్పడుతుందన్నారాయన. కృష్ణానదికి ఆపక్కన, ఈ పక్కన ఉన్న జనం రోజూ కొట్టుకునే పరిస్థితి ఉంటుందన్నారు. ఓట్ల కోసం సీట్ల కోసం ఇలాంటి నీచ రాజకీయాలకు పాల్పడవద్దన్నారాయన.
(ఇడుపులపాయలో తెలంగాణపై ఏ నిర్ణయం తీసుకుంటామన్నా అభ్యంతరం లేదన్నప్పుడు ఇవన్నీ గుర్తుకురాలేదా జగన్ బాబూ.. అప్పుడే నువ్వు ఇవన్నీ ప్రస్తావిస్తే, టీడీపీ కూడా విభజన కోసం వత్తిడి తెచ్చేది కాదేమో.. అప్పుడో మాట ఇప్పుడో మాట చెప్పే ఇలాంటి రాజకీయ నేతలవల్లే కదా ఇప్పుడీ పరిస్థితి వచ్చింది.. కాదనగలరా.. ఆ రోజు ఏమీ చేయలేనన్న వారికి.. ఇప్పుడు మాట్లాడే హక్కుందంటారా..)
4, అక్టోబర్ 2013, శుక్రవారం
రేపటి నుంచి జగన్ ఆమరణ దీక్ష
Categories :
bifurcation . deeksha . jagan . POLITICS . seemandhra . TOP . ysrcp
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి