23, సెప్టెంబర్ 2013, సోమవారం
జగన్కు బెయిల్
జగన్ నిరీక్షణ ఎట్టకేలకు ఫలించింది. దాదాపు 16 నెలల తర్వాత బెయిల్ మంజూరయ్యింది. అక్రమాస్తుల కేసులో 2012 మే 27న ఆయనను సీబీఐ అరెస్టు చేసింది. ఈ కేసులో విచారణ జరిపిన సీబీఐ పది ఛార్జిషీట్లను దాఖలు చేసింది. ఈ కేసులో అరెస్టయిన జగన్ 16 నెలలుగా నగరంలోని చంచల్గూడ కారాగారంలో ఉన్నారు. రూ.2 లక్షల చొప్పున ఇద్దరి పూచీకత్తు ఇవ్వాలని న్యాయస్థానం షరతు విధించింది. బెయిల్ షరతులు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దుచేయమని కోరుతూ న్యాయస్థానాన్ని సీబీఐ ఆశ్రయించవచ్చని న్యాయస్థానం పేర్కొంది. జగన్మోహన్రెడ్డి హైదరాబాద్ విడిచివెళ్లకూడదని కూడా న్యాయస్థానం తన ఆదేశాల్లో పేర్కొంది. కేసుతో సంబంధమున్న ఎవర్ని ప్రలోభపెట్టే యత్నం చేయరాదని న్యాయస్థానం ఆదేశించింది. జగన్ కు బెయిల్ రావడంతో వైఎస్సార్ సీపీ లో కొత్త ఉత్సాహం వచ్చింది. సీమాంధ్రలో పార్టీ మరింత బలపడుతుందని ఆశాభావంతో ఉన్నారు వైసీపీ నేతలు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి