రాజీనామాలపై ముందూ వెనుకా ఆలోచించిన సీమాంధ్ర మంత్రులు ఎట్టకేలకు పదవులను వదులుకోవాలనే నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే మంత్రి గంటా శ్రీనివాసరావు తన పదవికి రాజీనామా చేశారు. మిగిలిన వారూ ఈ రాత్రి సీఎం కిరణ్ ను కలిసి రాజీనామాలు సమర్పిస్తారని ప్రచారం సాగుతోంది. అటు సీమాంధ్రకు చెందిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు తమ పదవులకు రాజీనామా చేశారు. జేసీ దివాకర్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, గాదె వెంకటరెడ్డి, దగ్గుబాటి వెంకటేశ్వరరావు, వెంకట్రామయ్య, సుధాకర్, మురళీకృష్ణ, ఉగ్రనరసింహారెడ్డి శాసనసభ కార్యదర్శికి తమ రాజీనామా లేఖలు సమర్పించారు. మిగిలిన ఎమ్మెల్యేలు పీసీసీ చీఫ్ కు తమ రాజీనామా లేఖలు ఇవ్వాలని నిర్ణయించారు. రాజీనామాలు చేయకుండా ప్రజల్లోకి వెళ్లలేమంటున్న నేతలు, సమైక్య ఉద్యమాన్ని ఇకపై ముందుండి నడిపిస్తామంటున్నారు. అటు రాయలసీమకు చెందిన నేతలు మాత్రం, విభజనతో రాయలసీమకు అన్యాయం జరిగిందని, తాము ఎట్టి పరిస్థితుల్లోనూ హైదరాబాద్ తోనే కలిసి ఉంటామని చెబుతున్నారు. అటు సమైక్యం కావాలంటూనే, విభజన జరిగితే మాత్రం రాజధాని తమ ప్రాంతానికే కావాలంటూ పట్టుబడుతున్నారు. పోలవరానికి జాతీయ హోదా ఇవ్వడం ద్వారా కోస్తాకు మేలు చేస్తున్న కేంద్రం, సీమకూ ప్యాకేజ్ ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు.
అటు ఈ రాజీనామాల వ్యవహారంపై స్పందించిన రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్ దిగ్విజయ్ సింగ్ మాత్రం, ఇదంతా ముందే ఊహించామన్నారు. విభజన జరుగుతున్నప్పుడు ఇలాంటి భావోద్వేగాలు సహజమేనన్నారాయన. తెలంగాణపై ఎట్టి పరిస్థితుల్లోనూ వెనక్కి తగ్గేది లేదని పరిస్థితిని చక్కదిద్దడానికి పూర్తి స్థాయిలో ప్రయత్నిస్తామన్నారు దిగ్విజయ్
1, ఆగస్టు 2013, గురువారం
మొదలయ్యింది రాజీనామాల ఆట
Categories :
congress . ministers . POLITICS . rayala seema . resigns . seemandhra . telangana . TOP
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
ఇటువంటి ఆటలు తెలంగాణా ఉద్యమకారులూ చేసారు గదా. అప్పుడవి ఆటలుగా అనిపించలేదా?
డిసెంబర్ 9, 2009 తర్వాత రాష్ట్రంలో ఎన్నోపరిణామాలు చోటు చేసుకున్నాయి. కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ అంశంలో సుదీర్ఘమైన చర్చే సాగింది. చివరకు మూడు ప్రాంతాల నేతల నుంచీ కాంగ్రెస్ నివేదికలు తెప్పించుకుంది. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటామని చెప్పిన మహానుభావులే ఇప్పుడు రాజీనామాలకు సిద్ధపడుతున్నారు. అదే తెలంగాణ నేతలు, రాజీనామాలు చేయాలని ఎంత ఒత్తిడి వచ్చినా అధిష్టానంపై విధేయతను ప్రదర్శించి అందుకు దూరంగా ఉన్నారు. చెప్పిన మాటపై నిలబడలేని వాళ్లు నిజంగా లీడర్లేనా ... రేపు ప్రజలకు ఇచ్చిన హామీల విషయంలోనూ ఇలానే చేయరని గ్యారెంటీ ఉందా.. సమైక్యానికే ముందునుంచి కట్టుబడి ఉన్నామనుకుంటే, అధిష్టానం విభజనకు సిద్ధమైతే రాజీనామాలు చేస్తామని ముందునుంచి బెదిరించాల్సి ఉంది. అప్పుడు, వాళ్లు చేసింది తప్పుగా భావించాల్సిన అవసరం ఉండేది కాదు. చెప్పేది ఒకటి చేసేది ఒకటైనప్పుడే.. ఆటలుగా కనిపిస్తాయి.. దాన్ని శ్యామలీయం గారు అర్థం చేసుకుంటారనుకుంటాను.
సతీష్ గారు మంచి సమాదానం చెప్పారు.
సతీష్గారు మంచి సమాచారం ఇచ్చారు.
పరిస్థితులు మారాయి.
ప్రజల ఆకాంక్షలను నాయకులు ప్రతిబింబించాలా వద్దా చెప్పండి?
ఎన్నికైన నాయకులను ఎన్నుకున్నది ప్రజలు.
వాళ్ళ సామూహిక ఆకాంక్షలను శిరసావహించటం తప్పు పట్తరాదు.