రాజీనామాలు చేసిన అనంతరం పార్లమెంట్లో కాంగ్రెస్ ఎంపీలు |
తెలంగాణ ఏర్పాటుపై కాంగ్రెస్ ప్రకటన వెలువడ్డప్పటి నుంచి సీమాంధ్ర నేతలు నానా యాగీ చేస్తున్నారు. ఎవరినీ అడగకుండా ఎలా నిర్ణయం తీసుకున్నారని, నదీ జలాలు, వనరులు, ఆస్తులు అప్పులు, హైదరాబాద్ ఆదాయం పంచకుండా ఎలా విభజిస్తారంటూ గోల పెడుతున్నారు. చివరకు నిన్న ప్రెస్ మీట్ పెట్టిన సీఎం కూడా అదే మాట మాట్లాడారు. ఎన్నో వివాదాలుండగా వాటిని తేల్చకుండా ఎలా విభజిస్తారని. విభజన అన్నప్పుడు ఎక్కడైనా ఈ సమస్యలు వస్తూనే ఉంటాయి. వాటిని పరిష్కరించడానికే కేంద్రం ఉందన్న సంగతి అందరూ గుర్తుంచుకోవాలి.
మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, రాష్ట్ర విభజన ఇంకా పూర్తైపోలేదు. ఇప్పుడే మొదలవుతోంది. పైగా, నిర్ణయం ప్రకటించింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అన్ని పార్టీలు అభిప్రాయం చెప్పినా, ఐదేళ్లుగా ఈ విషయాన్ని నాన్చుతూ వచ్చిన కాంగ్రెస్ పార్టీ, మంచో చెడో తన నిర్ణయాన్ని చెప్పింది. వనరుల పంపిణీ, నదీ జలాల పంపిణీ గురించి కాంగ్రెస్ పార్టీ ముందుగానే ప్రకటించాల్సిన అవసరం లేదు. రాష్ట్ర విభజన ఆ పార్టీకి అంగీకారమో కాదో మాత్రమే చెప్పాలి. అదే చెప్పింది. టీడీపీ, సీపీఐ, వైసీపీ, బీజేపీ చెప్పినట్లే కాంగ్రెస్ కూడా తన అభిప్రాయాన్ని మాత్రమే చెప్పింది. విభజనకు ముందే వివాదాల పరిష్కారం గురించి కాంగ్రెస్ పార్టీ చెప్పాలంటే, దానికన్నా ముందుగా విభజనకు అంగీకారం తెలిపిన బీజేపీ, టీడీపీ లు కూడా చెప్పాల్సి ఉంటుంది.
ఇక విభజన వ్యవహారం మొదలైన తర్వాత కేంద్రం గుడ్డిగా సరిహద్దుల వెంబడి గీత గీసి రెండు రాష్ట్రాలను చేసేయదు. ఏ ప్రాంతానికి ఏం దక్కాలి, ఆస్తులు అప్పులు ఎలా విభజించాలి, జలవనరుల పంపిణీ ఎలా చేయాలన్నదానికోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తుంది. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా పార్లమెంట్ లో చర్చ జరుగుతుంది . ఆ తర్వాతే విభజన వ్యవహారం తేలుతుంది. ఇంకా కేబినెట్ కమిటీ వేసే దశ దాకా విభజన వ్యవహారం రానేలేదు. కానీ, ఇప్పుడే అన్నీ తేల్చాలంటూ కాంగ్రెస్ , టీడీపీ, వైసీపీ నేతలు రచ్చ రచ్చ చేస్తున్నారు. విభజన ప్రక్రియ ఎలా జరుగుతుందో వీళ్లెవరికీ తెలియదా.. తెలియకుండానే లీడర్లైపోయారా..
పార్లమెంట్ దగ్గర టీడీపీ ఎంపీల ఆందోళన |
ఇంతవరకూ సీమాంధ్రకు ఏమిస్తారో, తెలంగాణకు ఏమిస్తారో కేంద్రం ఒక్కమాటైనా చెప్పలేదు. అయినా, సీమాంధ్రకు అన్యాయం జరిగిపోయిందని గగ్గోలు పెట్టడం సమంజసం కాదు. కేంద్ర కేబినెట్ కమిటీ ఒకవేళ నిజంగానే అన్యాయంగా కేటాయింపులు చేస్తే, అప్పుడు ఆందోళన చేయడంలో తప్పులేదు.. కానీ ఆలూలేదు చూలూలేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్లు.. బోడిలింగాలంతా కలిసి, జనాన్ని వెర్రిపప్పల్ని చేస్తున్నారు.
మరి అలూ చూలూ లేకూండానే గద్ద ముక్కు గాడు ఆంధ్రా వాళ్ళను హైదరాబాద్ నుండి వెళ్ళిపోమని చెప్పాడు కదా.. ఇది మీ బుధ్ధికి తట్టలేదా..