21, ఫిబ్రవరి 2013, గురువారం
బ్రేకింగ్ న్యూస్: హైదరాబాద్ లో బాంబు పేలుళ్లు.. 20 మందికి పైగా మృతి
Categories :
bomb blast . dilsuknagar blast . hyderabad . news . terrorist . TOP
అత్యంత రద్దీగా ఉండే దిల్ సుఖ్ నగర్ ప్రాంతంలో ఐదు చోట్ల బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈ పేలుళ్లలో దాదాపు 20మంది చనిపోయి ఉండొచ్చని తెలుస్తోంది. 50 మందికి పైగా గాయాలయ్యాయి. దిల్ సుఖ్ నగర్ బస్టాండ్ కు ఎదురుగా ఉన్న వెంకటాద్రి, కోణార్క్ థియేటర్, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్, ఆనంద్ టిఫిన్ సెంటర్ ల దగ్గర రాత్రి 7 గంటల నుంచి 7 గంటల 7 నిమిషాల మధ్య బాంబులు ఒక్కసారిగా బాంబుల పేలాయి. పేలుళ్ల శబ్ధం విని జనం భయాందోళనలకు గురయ్యారు. తలోదిక్కూ పరుగులు తీయడంతో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలోనూ చాలా మంది గాయపడ్డారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా హైఅలర్ట్ ప్రకటించారు పోలీసులు. భారీగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. పేలుళ్లపై కేంద్ర హోంమంత్రి షిండే ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి