28, డిసెంబర్ 2012, శుక్రవారం
మొదలైన అఖిలపక్షం
Categories :
తెలంగాణపై కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే నిర్వహిస్తున్న అఖిలపక్ష సమావేశం మొదలయ్యింది. కాంగ్రెస్ నుంచి గాదె వెంకటరెడ్డి, మాజీ స్పీకర్ సురేశ్ కుమార్ రెడ్డిలు పాల్గొంటున్నారు. ఇద్దరూ రెండు ప్రాంతాల అభిప్రాయాలను చెప్పే అవకాశం ఉంది. టీడీపీ నుంచి యనుమల, కడియం పాల్గొంటున్నారు. ఒకే అభిప్రాయాన్ని చెబుతామంటున్న టీడీపీ నేతలు తమ అభిప్రాయాన్ని సీల్డ్ కవర్లో హోంమంత్రికి అందించనున్నారు. టీఆర్ఎస్ నుంచి కేసీఆర్, నాయని, వైఎస్సార్ సీపీ నుంచి మైసూరారెడ్డి, కెకె మహేందర్ రెడ్డి, సీపీఎం నుంచి రాఘవులు, జూలకంటి, సీపీఐ నుంచి నారాయణ, గుండా మల్లేశ్, ఎంఐఎం నుంచి అసదుద్దీన్, జీవీకే నాయుడులు పాల్గొంటున్నారు. ఎంఐఎం సమైక్య రాష్ట్రానికే పట్టుబడుతోంది. తప్పనిసరి పరిస్థితుల్లోవిడగొట్టాలంటే రాయలతెలంగాణను ఏర్పాటు చేయమంటోంది. సీపీఐ తెలంగాణకు మద్దతిస్తుండగా, వైఎస్సార్ సీపీ కేంద్రం ఏ నిర్ణయం తీసుకున్నా మద్దతు ఇస్తామంటోంది. పదకొండున్నర కల్లా ఈ భేటీ ముగిసిపోనుంది. అనంతరం షిండే మీడియా ముందు సమావేశ వివరాలను వెల్లడించనున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి