7, అక్టోబర్ 2012, ఆదివారం
కేసీఆర్ కొంప మునిగినట్లేనా..?
Categories :
ajith singh . kcr . POLITICS . telangana . TOP
జాతీయ స్థాయిలో పలుకుబడి ఉందని చెప్పుకోవడానికి, తన సభలకు అప్పుడప్పుడు తెచ్చుకున్న అజిత్ సింగ్, ఇప్పుడు కేసీఆర్ కే ఏకుకు మేకై కూర్చున్నాడు. తెలంగాణకు తన పార్టీ కార్యకలాపాలను విస్తరించారు. కేసీఆర్ కు ఒకప్పటి కార్యదర్శి అయిన కపిల్వాయి దిలీప్ కుమార్ కు క్రియాశీల బాధ్యతలు అప్పజెప్పారు. ఆయన భార్య ఇందిరను.. తెలంగాణ రాష్ట్రీయ లోక్ దళ్ కు గౌరవ అధ్యక్షురాలిగా ప్రకటించారు. టీఆర్ఎస్, బీజేపీలకు ప్రత్యామ్నయ తెలంగాణవాద పార్టీకోసం ఎదురుచూస్తున్న ఎంతోమందికి, ఇప్పుడు ఇది రాజకీయ పునరావాస వేదిక అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సొంతగా పార్టీ పెడితే టీఆర్ఎస్ ను ఎదుర్కోవడం కష్టం అని తెలుసుకున్న దిలీప్ కుమార్, తెలివిగా అజిత్ సింగ్ ను రంగంలోకి దింపారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో కీలక పాత్ర పోషించేదిశగా ఆయన పావులు కదుపుతున్నారు. అటు జాతీయ స్థాయిలో మరింత ఎదగాలనుకుంటున్న అజిత్ సింగ్ కూడా.. ఈ అవకాశాన్ని తనకు అనుకూలంగా మలుచుకోవడానికి సిద్ధమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఒక్క ఎంపీ సీటైనా, సంకీర్ణ ప్రభుత్వంలో కీలకస్థానాన్ని అందిస్తుంది కాబట్టి.. వచ్చే ఎన్నికల్లో బలంగానే పనిచేయాలని భావిస్తున్నారు. అజిత్ సింగ్ బలపడితే.. కేసీఆర్ కొంప మునిగినట్లే..
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి