6, మార్చి 2012, మంగళవారం
రాహుల్ గాంధీని నమ్మని యూపీ జనం
Categories :
congress . rahul gandhi . TOP . up results
కాంగ్రెస్ భవిష్యత్ ఆశాకిరణం, పట్టాభిషేకం జరగని యువరాజు.. రాహుల్ గాంధీ యూపీ రణరంగంలో చిత్తుచిత్తుగా ఓడిపోయారు. యూపీలో కాంగ్రెస్ ను గెలిపించి, తన సమర్థతను చాటుకొని, దేశ రాజకీయాలను తన చేతుల్లోకి తీసుకోవాలని ఉవ్విళ్లూరిన సోనియా-రాజీవ్ ల తనయుడిని ఊహించని షాక్ ను ఇచ్చాయి. యూపీలో కాంగ్రెస్కు అత్యధిక స్థానాలు కట్టబెట్టడమో లేదంటే, కొత్త ప్రభుత్వానికి తమ అవసరం ఉండేలానో సీట్లను గెలుచుకోవాలని పావులు కదిపిన రాహుల్ గాంధీ.. కాంగ్రెస్ పార్టీకి నాలుగోస్థానాన్ని మాత్రమే సంపాదించగలిగారు. రాహుల్ సభలకు భారీ ఎత్తున జనం వచ్చినా, రోడ్ షోలకు విశేష ఆదరణ లభించినా, ఆ అభిమానం ఓట్ల వర్షాన్ని కురిపించలేదు. చెప్పాలంటే కాంగ్రెస్ యువనేతను గానీ, ఆయన హామీలను గానీ యూపీ ప్రజలు ఏమాత్రం విశ్వసించలేదని ఈ ఎన్నికలు నిరూపిస్తున్నాయి. యూపీ ఫలితాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రాహుల్.. ఈ ఓటమికి తనదే బాధ్యతని ప్రకటించుకున్నారు. ఈ ఎన్నికలు తనకు మంచి పాఠాన్ని నేర్పాయన్నారు. ఓ రకంగా చెప్పాలంటే.. ములాయం తనయుడు అఖిలేష్ యాదవ్ కు.. రాహుల్ గాంధీకి మధ్య సాగిన సంగ్రామంలో.. అఖిలేష్ కే విజయం దక్కింది. ఎస్పీ అధ్యక్ష బాధ్యతలను సమర్థవంతంగా మోస్తూ.. విస్తృతంగా రాష్ట్రంలో ప్రచారం చేసి భారీ విజయాన్ని సాధించారు. కానీ రాహుల్ కు పడ్డ ప్రయాస అంతా వృథానే అయ్యింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి