5, సెప్టెంబర్ 2011, సోమవారం
30 కిలోల బంగారం.. రూ. 7.45 కోట్ల నోట్లు
పక్కా ప్లాన్తో మూడో కంటికి తెలియకుండా ఒక్కసారిగా గాలి జనార్దనరెడ్డిపై పంజా విసిరిన సీబీఐ.. బళ్లారిలో మాత్రం కళ్లు తేలేసింది. అర్థరాత్రి సమయంలో గాలి నివాసాల్లోకి చొరబడి.. ఎవరూ తప్పించుకోకుండా చూసి సోదాలు చేసిన సీబీఐకు కళ్లు బైర్లు కమ్మే రీతిలో ఆస్తులు బయటపడ్డాయి. గాలి గారి సంపాదన చూసి సీబీఐ అధికారులే ఆశ్చర్యపోయారు. అక్రమమైనింగ్ వ్యవహారంలో కీలక పాత్రధారి,సూత్రధారి అయిన గాలి జనార్ధన్ రెడ్డి ఇంట్లో ఏకంగా 4 కోట్ల 45 రూపాయల నోట్ల కట్టలు దొరికాయి. ఇక గాలి బంధువు, ఓబులాపురం మైనింగ్ కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి ఇంట్లో ఏకంగా 30 కిలోల బంగారం, రూ.3 కోట్ల నగదు దొరికింది. జనార్ధనరెడ్డి భార్య పేరిట వందకోట్లకు పైగా ఆస్తులు ఉన్నాయట. అయితే.. జనార్దనరెడ్డి ఇంట్లో దొరికిన బంగారం ఎంతన్నది మాత్రం బయటకు రాలేదు. అక్రమమైనింగ్ వ్యవహారంలో 120బి, ఫారెస్ట్,మైనింగ్ యాక్ట్ ల కింది గాలి బ్రదర్స్ పై సీబీఐ కేసులు నమోదు చేసింది. పక్కా ఆధారాలు దొరికినందుకే అరెస్టులు చేశామని ప్రకటించింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి