10, జులై 2011, ఆదివారం
అరచేతిని అడ్డం పెట్టి సూర్యుడిని ఆపలేరు..
ఈ మాటనే ఇప్పుడు వల్లె వేస్తున్నారు ఉస్మానియా విద్యార్థులు. మలివిడత తెలంగాణ సాధన పోరాటంలో తొలినుంచీ క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న ఉస్మానియా విశ్వవిద్యాలయ విద్యార్థులు మరోసారి కదం తొక్కబోతున్నారు. సోమవారం నుంచి ఆమరణ నిరాహారదీక్షలను చేపడుతున్నారు. వేలాదిమంది విద్యార్థులు ఒకేసారి నిరశనకు దిగుతారని ఓయూ విద్యార్థి సంఘాలు ప్రకటించాయి. తెలంగాణకు మరో ప్రత్యామ్నయం లేదని, ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలైతేనే దీక్షలు విరమిస్తామనీ విద్యార్థినేతలు స్పష్టం చేశారు. విద్యార్థుల్లోనూ విబేధాలు లేవని, అన్ని సంఘాలు తెలంగాణ సాధన విషయంలో ఏకతాటిపై ఉన్నాయని తెలిపారు. తెలంగాణ జర్నలిస్టుల ఫోరం నిర్వహించిన మీట్ ద ప్రెస్ కార్యక్రమంలో భవిష్యత్ కార్యాచరణను నేతలు వెల్లడించారు. దీక్షలతో పాటు అసెంబ్లీ ముట్టడిని కూడా నిర్వహించి తీరుతామన్నారు. విద్యార్థుల ఉద్యమానికి భయపడే.. దీక్షలను భగ్నం చేయడానికి పోలీసులు కుట్ర పన్నుతున్నారని ఓయూ జేఏసీ ఆరోపించింది. శాంతియుతంగా, ప్రజాస్వామ్యయుతంగా చేస్తున్న దీక్షలను అడ్డుకోవడానికి ప్రభుత్వం పోలీసులను ఉసిగొల్పుతోందని విమర్శించింది.
సీఎందే కుట్ర- కేకే
విద్యార్థుల దీక్షలను అణచివేయడానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి కుట్ర పన్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత కే.కేశవరావు ఆరోపించారు. విద్యార్థుల దీక్షలకు పోలీసులు అనుమతి నిరాకరించడం సరికాదన్నారు. సీఎం ప్రోద్భలంతోనే పోలీసులు వ్యవహరిస్తున్నారంటూ దుయ్యబట్టారు. రాజీనామాల విషయంలో తాము వెనక్కితగ్గే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి