22, ఏప్రిల్ 2011, శుక్రవారం
సత్యసాయి విషయంలో ట్రస్ట్ సంచలన నిర్ణయం?
Categories :
సత్యసాయి దేవుడని, మహామహిమాన్వితుడని ఇంతకాలం చాటిచెప్పిన సాయి అనుచరగణం.. సాయి జీవితానికి అనూహ్యముంగిపును పలకాలని భావిస్తున్నట్లు తెలిస్తోంది. బాబా ఆరోగ్యంపై ఇప్పటికే ఎన్నో కథనాలు, కథలు.. వదంతులు వ్యాపిస్తూనే ఉన్నాయి. వీటన్నింటి త్వరలోనే శుభం కార్డు పలకబోతోంది. ఇంతకీ సత్యసాయి ట్రస్ట్ ఏం చేయబోతోందో తెలుసా..?
సత్యసాయిబాబా బతికున్నాడో లేదో తెలియదు. మార్చి 28న హాస్పిటల్లో చేరినప్పటినుంచి డాక్టర్లు చెబుతున్నమాటలే తప్ప.. బాబా పరిస్థితి ఎలా ఉందో ఎవరూ ప్రత్యక్షంగా చూడలేదు. దీంతో.. బాబా చనిపోయాడన్న పుకార్లు వ్యాపించాయి. ఆస్తులను పంచుకోవడం కోసమే ట్రస్ట్ సభ్యులు నాటకం ఆడుతున్నారంటూ విమర్శలూ వినిపిస్తున్నాయి. అయితే.. బాబా కుటుంబ సభ్యుడైన రత్నాకర్ రాజు, బాబా ఆరోగ్యం ఇంకా విషమంగానే ఉందని చెప్పడం చూస్తే.. బతికేఉన్నట్లు భావించవచ్చు. ప్రస్తుతం అత్యాధునిక వైద్యం అందిస్తున్నా, బాబా శరీరంలో స్పందనలు పెద్దగా కలగడం లేదు. పరిస్థితి చూస్తుంటే, బాబా కోలుకుంటాడన్న ఆశ కూడా లేదు. అందుకే.. ఈ మొత్తం ఎపిసోడ్కు త్వరలోనే ముగింపు పలకాలని సత్యసాయి ట్రస్ట్ భావిస్తోంది. బాబా సజీవ సమాధిలోకి వెళ్లిపోయారని ప్రకటించాలనుకొంటోంది. ప్రస్తుతానికి ట్రస్ట్ సభ్యుల్లో ఈ విషయంపై తీవ్రంగా వాదోపవాదాలు జరుగుతున్నాయి. రత్నాకర్రాజు దీనికి వ్యతిరేకించినట్లు సమాచారం. కానీ, త్వరలోనే ఈ వార్త బయటకు వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తోంది. బాబా సజీవసమాధి చెందారని ప్రకటించేస్తే.. ఇక హాస్పిటల్లో ఉంచాల్సిన అవసరం ఉండదు. సత్యసాయి సేవాకార్యక్రమాలు.. సత్యసాయి ఆధ్యాత్మిక ప్రపంచమంతా ట్రస్ట్ చేతుల్లోకి వచ్చేస్తుంది. సభ్యులకు కావాల్సింది కూడా ఇదే.
అయితే.. 96 ఏళ్ల పాటు ఈ దేహంలోనే జీవిస్తానని చెప్పిన సత్యసాయి... 86 ఏళ్ల వయస్సులోనే ఇలా ప్రాణంతో పోరాడాల్సిన పరిస్థితికి చేరుకోవడమే ఆలోచించాల్సిన విషయం.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి