రుణమాఫీపై చంద్రబాబు సర్కార్ పిల్లిమొగ్గలేస్తోంది. ఎంత కష్టమైనా, ఎంత భారమైనా రుణమాఫీ అమలు చేస్తామంటూ ఓట్ల కోసం ఎన్నికల్లో హామీ ఇచ్చిన చంద్రబాబు.. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి పదిహేను రోజులవుతున్నా ఇంతవరకూ దానిపై ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. ఎంత రుణం ఉన్నా మాఫీ చేస్తామని గతంలో చెప్పిన టీడీపీ అధినేత, ఇప్పుడు లక్షన్నరకే పరిమితమయ్యేలా కనిపిస్తున్నారు. అంతేకాదు పంటరుణాలతో పాటు, బంగారంపై తీసుకున్న రుణాలను కూడా మాఫీ చేస్తామని హామీ ఇచ్చేసిన ఆయన ఇప్పుడు, అందులో ఏదో ఒకటే మాఫీ చేస్తానంటున్నాడు. అయినా, బ్యాంకర్లు ముందుకు రావడం లేదంటూ కొత్త పాట పాడుతున్నారు తెలుగుదేశం నేతలు. ఇదంతా చూస్తుంటే రుణమాఫీపై వెనకడుగు వేసేలానే కనిపిస్తోంది. పైగా, కేంద్రం, బ్యాంకర్లు సహకరించడం లేదంటూ దొంగఏడ్పులు మొదలుపెట్టారు. హామీ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ గానీ, ఎన్డీఏ కాదు.. హామీ ఇచ్చింది టీడీపీ కానీ, బ్యాంకర్లు కాదు.. ఈ హామీ ఇచ్చినప్పుడు ఎన్డీఏను గానీ, బ్యాంకర్లను గానీ చంద్రబాబు సంప్రదించలేదు వారినుంచి హామీ పొందలేదు. అలాంటప్పుడు మీరిచ్చిన హామీ నెరవేర్చడానికి, బ్యాంకర్లను, కేంద్ర ప్రభుత్వానికి మసి పూయాలని చూడడం ఎంతవరకూ సమంజసం ? మాఫీ అమలు చేయకపోతే మాత్రం జనం చంద్రబాబు వచ్చిన అధికారాన్ని మాఫీ చేసేస్తారు..
23, జూన్ 2014, సోమవారం
మాఫీ మాయమవుతుందా..?
Categories :
ANDHRA PRADESH . chandrababu . loan waiver . new rules . seemandhra . tdp
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి