తిరుపతి సభలో సంచలన ప్రకటన చేశారు చంద్రబాబు. ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన మోడీ సభలో చంద్రబాబు మాట్లాడిన ఓ విషయం అందరినీ నివ్వెర పోయేలా చేసింది. కేసీఆర్ ను తీవ్రంగా విమర్శించిన అనంతరం, సీమాంధ్ర అభివృద్ధికి కృషి చేస్తానని చెప్పుకొచ్చారు. పనిలో పనిలా మోడీ గారిని సభా వేదిక మీద నుంచి ఓ విషయాన్ని కోరుతున్నానన్న బాబు.. అవినీతి భారతాన్ని నిర్మాద్దామన్నారు. అందుకు మీరే సమర్థులంటూ మరో వాక్యాన్ని జోడించారు. చంద్రబాబు ఉద్దేశం అవినీతి రహిత భారతం కానీ, ఆయన తన ప్రసంగంలో రహిత ఎగరగొట్టేశారు. మోడీని ఇరకాటంలో పడేశారు.
30, ఏప్రిల్ 2014, బుధవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి