టీడీపీ బీజేపీల మధ్య పొత్తు మూణ్ణాళ్ల ముచ్చటే అయ్యింది. సీమాంధ్రలో పొత్తును రద్దు చేసుకుంటున్నట్లు ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు. మోడీని పీఎం చేయాలన్న ఉద్దేశంతోనే బీజేపీతో పొత్తు పెట్టుకున్నామన్న ఆయన, ఆ పార్టీ బలహీన అభ్యర్థులను నిలబెడుతోందని విమర్శించారు. దీనివల్ల ఇతర పార్టీలు లబ్ది పొందుతాయని, అందుకే ఆంధ్రప్రదేశ్లో పొత్తును రద్దు చేసుకుంటున్నామని ప్రకటించారు బాబు.
అయితే, పురంధేశ్వరికి బీజేపీ టికెట్ ఇవ్వడం, రఘురామకృష్ణంరాజుకు నర్సాపురం టికెట్ ఇవ్వకపోవడం వల్లే పొత్తును రద్దు చేసుకున్నట్లు టీడీపీ వర్గాలు అనధికారికంగా చెబుతున్నాయి. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం పురంధేశ్వరిని పూర్తిగా పక్కన పెట్టడానికి, నర్సాపురంలో రఘురామకృష్ణంరాజుకు టికెట్ ఇవ్వడానికి కమలం పార్టీ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆరెస్సెస్ నుంచి వత్తిడి పెరగడంతో గోకరాజు గంగరాజును నర్సాపురం అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ. దీంతో అవాక్కైన రఘురామకృష్ణంరాజు చంద్రబాబుతో చర్చలు జరిపారు. తాజాగా ఆయన టీడీపీ తరపునే నామినేషన్ వేసినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో పొత్తు రద్దైనప్పటికీ, తెలంగాణలో మాత్రం పొత్తు కొనసాగుతుందని టీడీపీ నేతలు చెబుతున్నారు.
దీనిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీజేపీ నేతలు, మోడీ, చంద్రబాబు సంయుక్త సభలు లేకుండా ఉండేలా చేస్తున్నట్లు తెలుస్తోంది.
అయితే, పురంధేశ్వరికి బీజేపీ టికెట్ ఇవ్వడం, రఘురామకృష్ణంరాజుకు నర్సాపురం టికెట్ ఇవ్వకపోవడం వల్లే పొత్తును రద్దు చేసుకున్నట్లు టీడీపీ వర్గాలు అనధికారికంగా చెబుతున్నాయి. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం పురంధేశ్వరిని పూర్తిగా పక్కన పెట్టడానికి, నర్సాపురంలో రఘురామకృష్ణంరాజుకు టికెట్ ఇవ్వడానికి కమలం పార్టీ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అయితే, ఆరెస్సెస్ నుంచి వత్తిడి పెరగడంతో గోకరాజు గంగరాజును నర్సాపురం అభ్యర్థిగా ప్రకటించింది బీజేపీ. దీంతో అవాక్కైన రఘురామకృష్ణంరాజు చంద్రబాబుతో చర్చలు జరిపారు. తాజాగా ఆయన టీడీపీ తరపునే నామినేషన్ వేసినట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్ లో పొత్తు రద్దైనప్పటికీ, తెలంగాణలో మాత్రం పొత్తు కొనసాగుతుందని టీడీపీ నేతలు చెబుతున్నారు.
దీనిపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బీజేపీ నేతలు, మోడీ, చంద్రబాబు సంయుక్త సభలు లేకుండా ఉండేలా చేస్తున్నట్లు తెలుస్తోంది.
కామెంట్ను పోస్ట్ చేయండి