రాష్ట్ర విభజనను నిరసిస్తూ కాంగ్రెస్ హైకమాండ్ తో విభేదించడమే కాక, ముఖ్యమంత్రి పదవికి, కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన కిరణ్ కుమార్ రెడ్డిఎట్టకేలకు కొత్త పార్టీని పెడుతున్నట్లు ప్రకటించారు. ఈనెల 12వ మధ్యాహ్నం 4 గంటలకు రాజమండ్రిలో నిర్వహించే బహిరంగ సభలో పార్టీ పేరును ప్రకటిస్తామన్నారాయన. తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని కాపాడడం కోసమే తాను పార్టీ పెడుతున్నామన్నారు మాజీ సీఎం. కాంగ్రెస్ బహిష్కృత ఎంపీలతో సుదీర్ఘ చర్చలు జరిపిన కిరణ్, చివరకు మీడియా సమావేశంలో పార్టీ ఏర్పాటు నిర్ణయాన్ని తెలిపారు. రాష్ట్రాన్ని ముక్కలు చేయడానికి అన్ని పార్టీలు దోహదం చేశాయని వాటిలో వేటీకి జనం ఓట్లు వేయరన్నారు కిరణ్. తమ పార్టీ ద్వారా కొత్త తరహా రాజకీయాన్ని చూపిస్తామన్నారాయన. విద్యార్థులు, జర్నలిస్టులకూ టికెట్లు ఇస్తామని ప్రకటించారు. పార్టీ పేరుతో పాటు విధివిధానాలను రాజమండ్రిలో ప్రకటిస్తామన్నారు. ఉండవల్లి అనారోగ్య కారణాలతో, శైలజానాథ్ విదేశాల్లో ఉండడం వల్ల, రాయపాటి ఆలస్యం కావడం వల్ల రాలేకపోయారంటూ స్పష్టతనూ ఇచ్చి, వదంతులు రాకుండా జాగ్రత్త పడ్డారు.
6, మార్చి 2014, గురువారం
కొత్త పార్టీ పెట్టిన కిరణ్
Categories :
congress . election . kiran kumar . new party . POLITICS
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి