3, డిసెంబర్ 2013, మంగళవారం
యూటీ మూగబోయే.. ప్రత్యేక రాష్ట్ర పాట మొదలయ్యే
Categories :
bifurcation . hyderabad . jd sheelam . kavuri . pallam raju . POLITICS . seemandhra . shinde . special state . telangana . TOP
రాష్ట్రాన్ని విభజిస్తే హైదరాబాద్ ను యూటీ చేయాల్సిందేనని, లేకపోతే విభజనకు అంగీకరించమని నానా హడావుడి చేసిన సీమాంధ్ర కేంద్ర మంత్రులు, హైకమాండ్ పట్టించుకోకపోయేసరికి కొత్తపాట మొదలుపెట్టారు. ఇవాళ సాయంత్రం జీవోఎం చివరి సమావేశం జరుగుతుండడంతో సరికొత్త ప్రతిపాదనను లేవనెత్తారు. పరిమితకాలం పాటు హైదరాబాద్ ను ప్రత్యేక రాష్ట్రంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. కావూరి చాంబర్ లో సమావేశమై చర్చలు జరిపిన జేడీశీలం, పళ్లంరాజు, జీవోఎం భేటీకి ముందే షిండేను కలిసి ఈ విజ్ఞప్తి చేయాలని నిర్ణయించారు. అటు 69 పేజీల నివేదికను సిద్ధం చేసిన జీవోఎం ఇవాళ భేటీ అనంతరం, దాన్ని ప్రధానికి, కేబినెట్ కు పంపించనుంది. రాయలతెలంగాణ ఏర్పాటు దిశగానే నివేదిక సిద్ధమైనట్లు తెలుస్తోంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి