18, అక్టోబర్ 2013, శుక్రవారం
పాలకొల్లు దొంగనోట్ల వెనుకున్న పాపాత్ములెవరు?
Categories :
fake currency . fake notes . news . palakollu . TOP
పాలకొల్లులో వెలుగు చూసిన దొంగనోట్ల వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టిస్తోంది. పాలకొల్లు పిల్లివారి వీధిలో చాలాకాలంగా మకాం వేసిన ముఠా, ఈ దొంగనోట్లను రాష్ట్ర వ్యాప్తంగా చెలామణీ చేస్తుందన్న ప్రచారం ఉంది. వీరికి స్థానిక పోలీసులు, రాజకీయ నాయకుల అండదండలు ఉండడంతో గుట్టుచప్పుడు కాకుండానే వ్యవహారం ఇంతకాలం సాగుతూ వచ్చింది. ఇప్పుడు హైదరాబాద్ సీఐడీ పోలీసులు రంగంలోకి దిగి కీలక సమాచారం ఇవ్వడంతో, పశ్చిమ పోలీసులు తప్పనిసరి పరిస్థితుల్లో కదిలారు. దొంగనోట్ల చెలామణీలో కీలక సూత్రధారి అయిన శాంతకుమార్ను పాలకొల్లులో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అతనిచ్చిన సమాచారంతో మరో ఐదుగురిని కూడా అరెస్ట్ చేశారు. వీరి దగ్గర నుంచి భారీ ఎత్తున దొంగనోట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. వీరికి ఓ ఎమ్మెల్యే భర్త సహకారం ఉందన్న ప్రచారం పాలకొల్లులో జోరుగా సాగుతోంది. అందువల్లే ఈ ముఠా దర్జాగా కార్యకలాపాలు నిర్వహించిందంటున్నారు జనం. దీని అంతుతేల్చడానికి ఓ బృందాన్ని ప్రత్యేకంగా హైదరాబాద్కు పంపించారు పోలీసులు. అండగా ఉన్న రాజకీయనేతల గుట్టు తేల్చే పనిలో ఉన్నామని పోలీసులు అనధికారింగా చెబుతున్నప్పటికీ, అది ఎంతవరకూ నిజమవుతుందన్నది సమాధానం లేని ప్రశ్నే. బంగ్లాదేశ్ నుంచి పశ్చిమ బెంగాల్ మీదుగా, ఈ నోట్లు మన రాష్ట్రానికి వస్తున్నట్లు తెలుస్తోంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి