24, అక్టోబర్ 2013, గురువారం
ధోనీ ఇంటిపై రాళ్లదాడి
భారత క్రికెట్ కెప్టెన్ ధోనీ ఇంటిపై నిన్న రాత్రి రాళ్లదాడి జరిగింది. బుధవారం రాంచీలో జరిగిన నాలుగోవన్డే వర్షం కారణంగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన కాసేపటికే ఈ దాడి జరగడం గమనార్హం. కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు వచ్చి రాళ్లు విసిరి పరారైనట్లు తెలుస్తోంది. ఈ దాడిలో ఇంటి ముందున్న అద్దాలు ధ్వంసమయ్యాయి. ఆ సమయంలో ధోనీ ఇంట్లో ఎవరూ లేరు. కుటుంబ సభ్యులంతా మ్యాచ్ చూడడం కోసం రాంచీ స్టేడియంలో ఉన్నారు. దీనిపై ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ధోనీ నివాసం దగ్గరున్న సీసీకెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో పడ్డారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి