3, అక్టోబర్ 2013, గురువారం
రాష్ట్రంలో హై అలర్ట్
Categories :
cabinet note . dgp . high alert . news . police security . t note . telangana . TOP
తెలంగాణపై కేంద్ర కేబినెట్ నోట్ తయారైన నేపథ్యంలో రాష్ట్రంలో హైఅలర్ట్ ప్రకటించారు. కేబినెట్ నోట్ కు ముందే అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పోలీసులకు అందించింది హోంశాఖ. దీంతో అన్ని జిల్లాల ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు కొత్త డీజీపీ ప్రసాదరావు. ముఖ్యంగా సీమాంధ్ర ప్రాంతాల్లో భారీగా ఆందోళనలు, నిరసనలు జరిగే అవకాశం ఉండడంతో జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ లాఠీఛార్జీలకు దిగవద్దని, పూర్తి సంయమనం పాటిస్తూ, ఆందోళనలు నియంత్రించాలని సూచించారు. అరవై రోజులకు పైగా సీమాంధ్రలో ఆందోళనలు నిర్వహిస్తున్న ఏపీఎన్జీవోలు, ఆర్టీసీ,ప్రభుత్వ ఉద్యోగులంతా రేపటినుంచి తమ పోరాటాన్ని మరింత ఉధృతం చేయాలని నిర్ణయించారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి