రాష్ట్ర విభజనతో హైదరాబాద్ లో ఉన్న సీమాంధ్రులు ఆందోళన చెందుతున్నారంటూ సీమాంధ్ర నేతలు కొంతమంది తీవ్రంగా వాదిస్తున్నారు. హైదరాబాద్లో ఉన్నవాళ్లకు భద్రత ఏదంటూ ప్రశ్నలమీద ప్రశ్నలు గుప్పిస్తున్నారు. హైదరాబాద్ లోనూ, తెలంగాణ ప్రాంతంలోనూ వచ్చి స్థిరపడ్డవాళ్లపై ఎక్కడలేని ప్రేమనూ ఒలకబోస్తున్నారు. కానీ, వాస్తవాన్ని మాత్రం వాళ్లు గ్రహించలేకపోతున్నారు. ఎందుకంటే, మాకు రక్షణ లేదంటూ, హైదరాబాద్ లో గానీ, తెలంగాణలో గానీ ఒక్క సెటిలర్ కూడా ఇంతవరకూ తమ భద్రతకు సమస్య వచ్చిందని భయపడడంలేదు. రోడ్డెక్కి ఆందోళనకూ దిగలేదు. ఏ పోలీస్ స్టేషన్ లోనూ తమకు సెక్యూరిటీ కావాలని అడగలేదు.
అంతెందుకు, తెలంగాణలోని నిజామాబాద్, మెదక్, కరీంనగర్, వరంగల్, నల్గొండ, ఖమ్మం జిల్లాల్లో ఐదు దశాబ్దాలకు ముందే వచ్చి స్ధిరపడ్డ ఆంధ్రా కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. వీళ్లకు తమ సొంత ప్రాంతాల్లో అంగుళం భూమి గానీ, అర్థరూపాయి ఆస్తిగాని లేదు. తెలంగాణ ఉద్యమం మొదలై పదమూడేళ్లుగా సాగుతున్నా, గత మూడేళ్లలో కనీవినీ ఎరుగుని రీతిలో ఉధృతంగా సాగినా, ఒక్క సెటిలర్ కూ ఇబ్బంది రాలేదు. ఇలా స్థిరపడ్డ కుటుంబాల్లో ఒక్క కుటుంబం కూడా ఆంధ్రాకు తిరిగి వలస పోలేదు. ఎందుకంటే, వాళ్లూ ఇక్కడ భూమితో, ఇక్కడి సమాజంతో మమేకమైపోయారు. ఆంధ్రా కుటుంబాల్లో ఎంతో మంది ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగిన వాళ్లున్నారు. వాళ్లూ తెలంగాణ బిడ్డలే.
ఈ విషయాన్ని పక్కన పెడితే, సీమాంధ్ర నేతలు, సీమాంధ్రలో ఉండి తెలంగాణలో ఉన్న తమవాళ్ల గురించి ఆందోళన చెందుతున్న వాళ్లు తెలుసుకోవాల్సిన విషయం మరొకటి ఉంది. హైదరాబాద్ లోని నిత్యావసర హోల్ సేల్ దుకాణాల్లో 90 శాతం తెలుగువాళ్లవి కాదు. రాజస్థాన్ నుంచి వచ్చిన వారే ఎక్కువగా ఈ దుకాణాలను నడుపుతున్నారు. హార్డ వేర్, ఎలక్ట్రానిక్స్ దుకాణాలూ 80 శాతానికి పైగా తెలుగువాళ్లవి కాదు, గుజరాత్ మార్వాడీల చేతుల్లోనే ఉన్నాయి. కోఠిలో గుజరాత్ గల్లీ పేరిట పెద్ద వాణిజ్య ప్రాంతమే ఉంది. ఇక బంగారం దుకాణాలు.. హైదరాబాద్లో ఉన్నవాటిలో ఒక్కటంటే ఒక్కటీ తెలుగువాళ్లది కాదు. హైదరాబాద్లో వీధికొక్కటి కనిపించే చాట్ బండార్స్ నడిపేవాళ్లలో ఒక్కరూ తెలుగువాళ్లు కాదు. వీళ్లెవరకూ విభజనతో రానిసమస్య ఆంధ్రాప్రాంతం నుంచి వచ్చి స్థిరపడ్డ తెలుగువాళ్లకు వస్తుందని ఆందోళన చెందాల్సిన పనేలేదు. అనవసరంగా రాజకీయ నాయకులు ఏదేదో ఊహించుకుని, నోటికొచ్చి మాట్లాడి, ఇక్కడ ఉన్నవాళ్లలో అనవసరమైన అనుమానాలు లేపకుండా ఉంటే అదే పదివేలు.
1, ఆగస్టు 2013, గురువారం
సెటిలర్లకు నిజంగానే సమస్యా?
Categories :
ANDHRA PRADESH . news . seemandhra . settlers . telangana . TOP
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
>వీళ్లెవరకూ విభజనతో రానిసమస్య ఆంధ్రాప్రాంతం నుంచి వచ్చి స్థిరపడ్డ తెలుగువాళ్లకు వస్తుందని ఆందోళన చెందాల్సిన పనేలేదు
వాస్తవమే.
కాని వీళ్ళెవరినీ కాక తెలంగాణాఉద్యమకారులూ నాయకులూ సీమాంధ్రులని దొంగలనీ దోపిడీదారులనీ ఇదనీ అదనీ చెడతిట్టారే మరి? దాని సంగతి ఏమిటీ?
My wife is from Rayalaseema. Many of my relatives are non-Telanganites.
None of them are scared. Why should anyone feel otherwise?
The main problem is the scare mongering propaganda by Andhra vested interests. Some gullible (and gutless) fall for this.
Dar dar ke jeena bhee kya zindagee hai
Darpokonpe sari duniya hasegaa
BTW the settlers have no problem with Telangana. Just go to Chikkadpalli or Vanastalipuram or the dozens of Gunturpallis.
The only guys who are acting scared are the recent migrants (Y2K Andhras).
గొట్టిముక్కలవారూ
ఈరోజున KCR మహానుభావుడు ఆంధ్రా ఉద్యోగులను గెంటివేస్తామని హర్షధ్వానాలమధ్య ప్రకటించాడే? దానికే మంటారూ?
ఇంకా సీమాంధ్రుల భయాందోలనలు అర్థరహితం అనే అంటారా?
@శ్యామలీయం:
Please read the following:
http://www.thehindu.com/news/national/andhra-pradesh/coastal-districts-employees-have-to-go-back-kcr/article4983220.ece
http://www.rediff.com/news/report/andhra-govt-employees-will-have-to-go-back-says-kcr---/20130802.htm
Don't go by one sided reports of Andhra scare mongerers
एक और तेलिंगी बड़प्पन का नमूना इधर देखिये:
http://blogs.reuters.com/india/2013/08/04/indias-telangana-fight-explores-new-frontiers-in-political-attack-ads/