30, జులై 2013, మంగళవారం
కాంగ్రెస్ ఒప్పేసుకుంది..
Categories :
congress . POLITICS . seemandhra . telangana . TOP
2004 నుంచి తెలంగాణ విషయాన్ని జీడిపాకంలా సాగదీస్తూ వచ్చిన కాంగ్రెస్ ఎట్టకేలకు తెరదించింది. యూపీఏ భాగస్వామ్య పక్షాల భేటీ అనంతరం నిర్వహించిన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోనూ పది జిల్లాల తెలంగాణకు అంగీకారం తెలిపింది. సీడబ్ల్యూసీ సమావేశంలో తెలంగాణ ఏర్పాటుపై ఏకగ్రీవ తీర్మానం చేశారు. సోనియా సహా మొత్తం 22 మంది పాల్గొన్న ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ విభజనపై గంటసేపు విస్తృతమైన చర్చను జరిపారు. సీమాంధ్రలో ఆందోళనలు వెల్లువెత్తుతున్నప్పటికీ, తెలంగాణను ఇస్తామని ఎప్పుడో చెప్పినందున, ఆ విషయంలో ముందుకు వెళ్లాలనే నిర్ణయించారు. ఈ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసి, రాష్ట్ర విభజన ప్రక్రియను మొదలుపెట్టాలని డిసైడ్ అయ్యారు సోనియా. కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయంతో తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు మొదలయ్యాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి