పదవి వస్తే ఒకలా.. రాకపోతే ఒకలా ఉండడం మన నేతలకు అలవాటన్న విషయం అందరికీ తెలిసింది. మంత్రి పదవులకోసం ఎలాంటి పనికైనా సిద్ధపడే నేతలు, ఆ పదవి అందిన తర్వాత కూడా దేనికైనా సిద్ధమంటారు. కాస్త కన్ ఫ్యూజింగ్ గా ఉన్నా, కేంద్ర మంత్రిగా ఇటీవల బాధ్యతలు చేపట్టిన కావూరి వ్యవహారాన్ని చూస్తే అర్థం అయిపోతుంది.
ఎన్నో సంవత్సరాలుగా మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేసీ చేసీ, చివరకు తనకన్నా చిన్నవాళ్లకు పదవులు దక్కడంతో వీధికెక్కిన కావూరి, ఆ మధ్య సమైక్య ఉద్యమవాణిని తెగ వినిపించారు. విశాఖపట్నం నుంచి తిరుపతి దాకా, విద్యార్థులు పెట్టిన సదస్సులకు హాజరై, తెలంగాణ ఇవ్వడానికి వీల్లేదని, రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచాలంటూ అరచి ఘీ పెట్టారు. రాష్ట్రాన్ని విభజిస్తే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కావూరి దూకుడు చూసి, పాపం సీమాంధ్ర విద్యార్థులు ఆయన్ను భుజాలకెత్తుకుని మోశారు.
అంతా బాగానే ఉన్నా, కేంద్రంలో రాజకీయ సమీకరణాలు మారిన దృష్ట్యా కావూరికి ఎట్టకేలకు కేబినెట్ ర్యాంకున్న మంత్రి పదవి దక్కింది. అంతే, ఆయన ఇంతవరకూ వినిపించిన సమైక్యగానం మూగబోయింది. తెలంగాణపై హస్తినలో తీవ్రంగా కసరత్తు జరుగుతోందని, త్వరలోనే ఏదో ఓ నిర్ణయం వెలువడవచ్చని వార్తలు వస్తున్న నేపథ్యంలో కావూరి మాత్రం, అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా దానికి కట్టుబడి ఉంటాననే చెబుతున్నారు. ఒకవేళ తెలంగాణ ఇవ్వడానికే కాంగ్రెస్ నిర్ణయం తీసుకున్నా, ఆయన నోరు మెదపరట. అంటే, సమైక్యపోరాటం చేసిందంతా మంత్రి పదవి దక్కించుకోవడానికేనా..?
28, జూన్ 2013, శుక్రవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి