12, ఏప్రిల్ 2013, శుక్రవారం
జగన్ ను ఉరేసినా పర్వాలేదన్న మంత్రి ఆనం
వైఎస్ ఉన్నన్నాళ్లు ఆయన భజన చేసిన మంత్రి ఆనం, ఇప్పుడు రూటు మార్చారు. జగన్ పై ఎప్పుడూ లేనంతగా విరుచుకుపడ్డారు. జగన్ పెద్ద దోపిడీ దారని, ఆయన్ని ఉరేసినా పర్వాలేదంటూ వ్యాఖ్యానించారు. చంచల్ గూడ జైలునే పార్టీ ఆఫీస్ గా జగన్ మార్చేశారని ఎద్దేవా చేశారు. సబితా ఇంద్రారెడ్డి అవినీతికి పాల్పడ్డారని సీబీఐ ఎక్కడా చెప్పలేదన్నారు. ఆ జీవోల వల్ల కూడా జగనే లబ్దిపొందారన్నారు ఆనం. మంత్రి ఆనం ఘాటుగా చేసిన ఈ వ్యాఖ్యలపై వైఎస్సార్ సీపీ మండిపడుతోంది. ఆనంకు వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టింది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి