అక్రమాయుధాలు కలిగి ఉన్నందుకు శిక్ష పడి, రేపు లొంగిపోవాల్సి ఉన్న బాలీవుడ్ హీరో సంజయ్ దత్ కు సుప్రీంకోర్టు ఊరట నిచ్చింది. అయితే, లొంగిపోవడానికి ఆరు వారాలు మున్నాభాయ్ గడువు కోరితే, కోర్టు నాలుగు వారాల టైమ్ మాత్రం ఇచ్చింది. తనపై నిర్మాతలు దాదాపు 278 కోట్లు పెట్టుబడులు పెట్టారని, సినిమాలను పూర్తి చేయకుండా జైలుకు వెళితే వారంతా నష్టపోతారని, అందుకోసం, తనకు మరికొంత సమయం ఇవ్వాలంటూ కోర్టును వేడుకున్నాడు సంజయ్.
సంజయ్ దత్ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు, నాలుగు వారాల సమయాన్ని ఇచ్చింది. ఇప్పుడు దీనిపైనే దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎందుకంటే, ఇదే కేసులో శిక్ష పడిన క్యాన్సర్ పేషెంట్ జైబున్నీసా తదితరులు గడువు కోరితే, సుప్రీంకోర్టు ఇచ్చే ప్రసక్తే లేదంటే లేదంటూ తీర్పు చెప్పింది కోర్టు. దీంతో, వీఐపీలకు ఓ న్యాయం తమకో న్యాయమా అంటూ ప్రశ్నిస్తున్నారు జైబున్నీసా కుటుంబ సభ్యులు.
17, ఏప్రిల్ 2013, బుధవారం
సామాన్యులకో న్యాయం.. వీఐపీలకో న్యాయమా..?
Categories :
arrest . extention . news . sanjay dutt . supreme court . TOP
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి