2, మార్చి 2013, శనివారం
ఆ నాలుగు కుటుంబాలకు చేజారనున్న శ్రీవారి అర్చకత్వం
Categories :
archakulu . divotional . news . priests . ramana deeskhitulu . tirumala . tirupati . TOP
తిరుమల శ్రీవారి సన్నిధిలో తరతరాలుగా వారసత్వ అర్చకత్వాన్ని అనుభవిస్తున్న ఆ నాలుగు కుటుంబాలకు చెక్ చెప్పారు ఈవో ఎల్వీ సుబ్రమణ్యం. ప్రస్తుతం ప్రధానార్చకులుగా ఉన్న రమణదీక్షితుల కుటుంబంతో పాటు మరో మూడు కుటుంబాలకు రొటేషన్ పద్దతిలో ప్రధాన అర్చకత్వ పదవి ఇంతకాలం దక్కుతూ వస్తోంది. ఈ నాలుగు కుటుంబాలకు చెందిన వారు తప్ప మరోవ్యక్తి ప్రధాన అర్చకత్వాన్ని పొందే అవకాశం ఇంతవరకూ రాలేదు. అయితే, సర్వీస్ నిబంధనలను అర్చకులకూ వర్తింప చేసిన టీటీడీ ఈవో, 65 ఏళ్లు దాటిన ప్రతీ ఒక్కరూ పదవీ విరమణ చేయాల్సిందేనని ఆదేశించారు. దీంతో, తిరుమలలో ఒకరు, తిరుచానూరు పద్మావతి ఆలయంలో ఇద్దరు పదవీ విరమణ చేయాల్సి వచ్చింది. వీరిస్థానాల్లో సర్వీస్ రూల్స్ కు అనుగుణంగా కొత్తవారిని నియమిస్తారు. దీంతో ఆ నాలుగు కుటుంబాల వారు పదవీ విరమణ చేస్తే వారి స్థానంలో వేరొకరు ప్రధానార్చక పదవిని చేపడతారే తప్ప.. ఆ కుటుంబాల్లోనే వారసత్వంగా ఆ పదవి దక్కదు. దీంతో తీవ్రంగా కలత చెందిన ఆ నాలుగు కుటుంబాలు ఆందోళనకు సిద్ధమవుతున్నాయి. అర్చకులకు పదవీ విరమణను అమలు చేయకూడదంటూ ఇవాళ టీటీడీ ఛైర్మన్ బాపిరాజును కలిసి మొరపెట్టుకున్నాయి. దీంతో, ఇవాళ జరిగే పాలకమండలి సమావేశంలో దీనిపై చర్చిస్తామని, అర్చకులకు న్యాయం చేస్తామని ఛైర్మన్ హామీ ఇచ్చారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి