21, ఫిబ్రవరి 2013, గురువారం
జగన్ ఆస్తులు ఈడీ పరం
జగన్ అక్రమ ఆస్తులు, ఎమ్మార్ కేసుల్లో ఈడీ వ్యవహరించిన తీరును సమర్థించింది ఎడ్జుడికేటింగ్ అథారిటీ. జగన్ కేసులో 51 కోట్లు, ఎమ్మార్ కేసులో 71 కోట్ల ఆస్తుల స్వాధీనానికి అనుమతి లభించింది. దీంతో మొత్తం 122 కోట్ల విలువైన ఆస్తులే స్వాధీనం చేసుకుంది ఈడీ. అటాచ్మెంట్ కారణంగా ఇక నుంచి ఈ ఆస్తులు అమ్మడం, లీజుకివ్వడం, రెంట్, లేదా ఆస్తులను వాడుకోవడానికి వీల్లేదు. దుబాయ్కి కంపెనీ ఎమ్మార్ ప్రాపర్టీస్ చెందిన 71 కోట్ల విలువైన ప్లాట్ల స్వాధీనానికి గతేడాదే ఈడీ నోటీసులు జారీచేసింది. అలాగే జగన్ అక్రమాస్తుల కేసులోనూ 51 కోట్ల విలువైన ఆస్తులను స్వాధీనానికి నోటీసులిచ్చింది. ఇందులో జనని ఇన్ఫ్రాకు చెందిన 13 ఎకరాల భూమి, జగతి పబ్లికేషన్కు చెందిన 14.50 కోట్ల ఫిక్స్డ్ డిపాజిట్లు స్వాధీనం చేసుకున్నారు. హెటరో డ్రగ్స్కు చెందిన 35 ఎకరాల భూమి, 3 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు, అరబిందో ఫార్మాకు చెందిన 96 ఎకరాలు, 3 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లు స్వాధీనం చేసుకుంది ఈడీ.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి