26, జనవరి 2013, శనివారం
టీజేఏసీ సమరదీక్షకు సర్కార్ రెడ్ సిగ్నల్
అఖిలపక్షంలో ప్రకటించినట్లు ఈనెల 28న తెలంగాణపై ప్రకటన చేసేలా, కేంద్రంపై ఒత్తిడి తేవడానికి తెలంగాణ రాజకీయ జేఏసీ రేపటినుంచి తలపెట్టిన సమరదీక్షకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. దీంతో, కేసీఆర్ తో జేఏసీ ఛైర్మన్ కోదండరామ్, ఉద్యోగ సంఘాల నేతలు సమావేశమై చర్చలు జరిపారు. అనంతరం హోంమంత్రిని కలిసి అనుమతి ఇవ్వాలని కోరారు. దీనిపై ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రాలేదు. దీంతో, ప్రభుత్వం అనుమతి ఇవ్వకున్నా, ఇందిరాపార్క్ దగ్గర ముందుగా అనుకున్నట్లే 36 గంటల సమరదీక్ష చేస్తామని టీజేఏసీ ప్రకటించింది. ఒక్కచోట దీక్ష చేస్తామంటే అనుమతి ఇవ్వనన్న కారణంగా, తెలంగాణ అంతటా దీక్షలు, ధర్నాలు చేపట్టాలని పిలుపునిచ్చింది. సమైక్యవాదుల ర్యాలీలకు, సభలకు అనుమతులు ఇస్తున్న ప్రభుత్వం తెలంగాణ సభలకు అనుమతి ఇవ్వకుండా కక్షపూరితంగా వ్యవహరిస్తోందని కోదండరామ్ విమర్శించారు. సమరదీక్ష చేస్తామని టీ జేఏసీ ప్రకటించిన నేపథ్యంలో ఆదివారం హైదరాబాద్ లో ఉద్రిక్త పరిస్థితులు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి