24, జనవరి 2013, గురువారం
అక్బరుద్దీన్ అవస్థలు
అనవసరంగా నోరు పారేసుకున్నందుకు తగిన మూల్యం చెల్లించుకుంటున్నారు ఎంఐఎం అగ్రనేతల్లో ఒకరైన అక్బరుద్దీన్. రాజమహల్ లాంటి ఇంట్లో హైక్లాస్ జీవితం అనుభవించే అక్బర్.. ఇప్పటికే జైలు జీవితంతో నానా అవస్థలు పడుతున్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, కేసుల కారణంగా జైలు నుంచే కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోంది. కొన్ని రోజుల క్రితమే ఆదిలాబాద్ నుంచి సంగారెడ్డి కోర్టుకు రావాల్సి వచ్చింది. నిజామాబాద్ కోర్టుకూ హాజరు కావాల్సి ఉంది. మరోవైపు రాష్ట్రంలో పలుచోట్ల ఆయనపై కేసులు నమోదవుతూనే ఉన్నాయి. వీటిపై కోర్టులు విచారణ మొదలుపెడితే, ఆయా కోర్టులకూ ఆయన్ను పోలీసులు తరలించాల్సి వస్తుంది.
తాజాగా అక్బరుద్దీన్ పై నమోదైన కేసులో బెంగళూరు ఛీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఫిబ్రవరి 23లోగా తమ ముందు అక్బరుద్దీన్ ను తమ ఎదుట హాజరు పరచాలంటూ ఆదేశాలు జారీ చేసింది. దీంతో, మరోసారి సుదీర్ఘ ప్రయాణం అక్బరుద్దీన్ కు తప్పకపోవచ్చు. పైగా, ఈ కేసులన్నీ తేలేసరికి ఎన్నాళ్లు పడుతుందో, అప్పటివరకూ బెయిల్ వస్తుందో లేదో చెప్పడం కష్టమే. ఒక వేళ బెయిల్ వచ్చినా, పలు కోర్టుల్లో జరిగే ఈ విచారణకు హాజరుకావడంతోనే విలువైన సమయం అంతా హరించుకుపోతుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి