28, డిసెంబర్ 2012, శుక్రవారం
నెల రోజుల్లో తెలంగాణ సమస్యకు పరిష్కారం?
Categories :
all party meeting . POLITICS . shinde . telangana . TOP
కొన్ని రోజులుగా రాష్ట్రరాజకీయాల్లో కాక పుట్టించిన అఖిలపక్ష సమావేశం ఎట్టకేలకు ముగిసింది. కేంద్ర హోం శాఖ పిలుపు అందుకున్న అన్ని పార్టీలు.. సమావేశానికి హాజరై తమ వాదనలు వినిపించాయి. మెజార్టీ పార్టీలు తెలంగాణకు అనుకూలంగానే వాదించినట్లు తెలుస్తోంది. పార్లమెంట్ లో బిల్లు పెట్టాలని బీజేపీ లేఖను హోంమంత్రి షిండేకు అందిస్తే.. గతంలో ఇచ్చిన లేఖకే కట్టుబడి ఉన్నామంటూ చంద్రబాబు రాసిన లేఖను అందించారు టీడీపీ నేతలు. కాంగ్రెస్ తరపున సురేశ్ రెడ్డి తెలంగాణ తరపున వాదన వినిపించారు. గాదె వెంకటరెడ్డి మాట్లాడుతుండగా, షిండే వారించి, మరో పార్టీకి అవకాశమిచ్చినట్లు మీడియా కథనాలు చెబుతున్నాయి. సీపీఎం మాత్రం సమైక్యరాష్ట్రాన్నే కొనసాగించాలని కోరింది. నెలరోజుల్లోగా ఈ సమస్యను పరిష్కరించాలని కోరింది. దీనికి షిండే సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. తెలంగాణ విషయంలో ఇదే చివరి అఖిలపక్ష సమావేశం అని ఆయన ప్రకటించారు. వైఎస్సార్ సీపీ ఏ నిర్ణయమూ తీసుకోలేమని చెప్పినట్లు తెలుస్తోంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి