27, మార్చి 2012, మంగళవారం
నిర్లక్ష్యమే జవాన్ల ప్రాణం తీసిందా?
Categories :
landmine blast . maoist . naxal . news . TOP
అదను చూసి పంజా విసరడం.. పోలీసుల నిర్లక్ష్యాన్ని సొమ్ము చేసుకోవడం.. ఈ రెండింటిలోనూ ఆరితేరిన మావోయిస్టులు.. మరోసారి భీకర దాడి చేశారు. గతంలో ఛత్తీస్గఢ్లో దాడి చేసినట్లే.. ఈసారి మహారాష్ట్రలో విరుచుకుపడ్డారు.. శక్తివంతమైన మందుపాతరను పేల్చడంతో.. గడ్చిరోలి జిల్లాలో 12 మంది జవాన్లు దుర్మరణం పాలయ్యారు .మరో 28 మందికి తీవ్రగాయాలయ్యాయి..
మహారాష్ట్ర.. గడ్చిరోలి జిల్లా.. దాదాపు 40 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు.. ఓ మినీబస్సులో ప్రయాణిస్తున్నారు. మావోయిస్టు ప్రాబల్యం ఉన్న పుస్తోలా ప్రాంతానికి వచ్చేసరికి ఒక్కసారిగా శక్తిమంతమైన మందుపాతర పేలింది. బస్సు గాల్లోకి ఎగిరి పక్కనపడిపోయింది.. బస్సులో ఉన్నవాళ్లంతా తలోదిక్కూ పడిపోయారు..
వాళ్లంతా ఆ షాక్లో ఉండగానే.. అక్కడే కాపుగాసిన మావోయిస్టులు ఫైరింగ్ మొదలుపెట్టారు. ప్రాణాలతో ఉన్న కొంతమంది జవాన్లు వారిపై ఎదురు కాల్పులు జరపడంతో.. పారిపోయారు.. సమాచారం అందడంతో.. అదనపు పోలీసు బలగాలు రంగంలోకి దిగాయి. భారీగా కూంబిగ్ చేపట్టాయి. దాడిలో చనిపోయిన, గాయపడ్డ జవాన్లను ముందుగా గడ్చిరోలి ఆస్పత్రికి తరలించారు. తీవ్ర గాయాలతో బాధపడుతున్నవారందరినీ మెరుగైన చికిత్స కోసం.. అక్కడినుంచి నాగ్పూర్కు తీసుకువెళ్లారు. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జయరాం రమేశ్ గడ్చిరోలిలో పర్యటించిన ఒక్కరోజు తర్వాత ఈ దాడి జరిగింది. మందుపాతర పేలిన ప్రాంతానికి చుట్టుపక్కల మరిన్ని మందుపాతరలు ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆంధ్రా ఒరిస్సా బోర్డర్లోనూ, చత్తీస్గఢ్లోనూ, ఇప్పుడు మహారాష్ట్రలోనూ పోలీసులు పెద్ద సంఖ్యలో ఇలానే ప్రాణాలు పోగొట్టుకోవడం అధికారులను కలవరపరుస్తోంది. ఎంతో అప్రమత్తంగా ఉండాల్సిన చోట.. పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే, ఇంత పెద్ద ప్రమాదం జరిగిందని అధికారులు భావిస్తున్నారు.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి