5, మార్చి 2012, సోమవారం
హైదరాబాద్లో సొరంగం నిజమే
హైదరాబాద్ బిర్లామందిర్ సమీపంలోని విద్యారణ్య స్కూల్ ఆవరణలో నిధులున్నాయంటూ హడావుడిగా తవ్వకాలు చేపట్టిన పురావస్తు శాఖకు ఎట్టకేలకు సానుకూల ఫలితం దక్కింది. ఎలాంటి నిర్ధారణ చేసుకోకుండా తవ్వకాలు మొదలుపెట్టడంపై ఎన్నో విమర్శలు వెల్లువెత్తాయి. దీనికి తోడు జేసీబీని ఉపయోగించి మట్టిని తొలగించడం.. కొంతమంది మాటలను నమ్మి పనులు చేయడంపై ఆరోపణలు కూడా వచ్చాయి. పైగా పదిహేను రోజుల పాటు తవ్వకాలు జరిగినా నేలమాలిగకు సంబంధించి చిన్న ఆధారాన్ని కూడా పురావస్తు శాఖ కనిపెట్టలేకపోయింది. దీంతో.. ప్రభుత్వరంగ సంస్థ ఎన్ ఎం డీసీని రంగంలోకి దించి, శాస్త్రీయ పద్దతుల్లో అన్వేషణ చేయించింది. దీనిపై నివేదిక తయారు చేసిన ఎన్ఎండీసీ భూఉపరితలానికి దాదాపు 20 అడుగుల లోతులో సొరంగం ఉన్నట్లు నిర్ధారించింది. దీనికి సంబంధించిన నివేదికను ఇవాళ ప్రభుత్వానికి సమర్పించింది. ప్రస్తుతం పదోతరగతి పరీక్షలు జరుగుతుండడంతో.. వేసవి సెలవుల్లోనే తవ్వకాలు జరపాలని పురావస్తుశాఖ భావిస్తోంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి