31, జులై 2011, ఆదివారం
సత్యం రామలింగరాజుకు బెయిల్ ?
సత్యం కుంభకోణంలో జైలు జీవితం గడుపుతున్న సత్యం రామలింగరాజుకు బెయిల్ పొందే అవకాశం వచ్చింది. సత్యం అవకతవకలపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ జూలై 31లోపు పూర్తి చేయకపోతే .. రామలింగరాజు అండ్ టీమ్ బెయిల్ పిటిషన్ను దాఖలు చేసుకోవచ్చని గతంలో సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇంతకుముందు రామలింగరాజు బృందం బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన సమయంలో సీబీఐ అభ్యంతరం వ్యక్తం చేయడంతో కోర్టు ఈ మేరకు ఆదేశాలిచ్చింది. అయితే.. సుప్రీం గడువు ముగిసినా సత్యంపై సీబీఐ దర్యాప్తు ఓ కొలిక్కి రాలేదు. దీంతో బెయిల్ కోసం మళ్లీ కోర్టును ఆశ్రయించే అవకాశం రామలింగరాజుకు దక్కనుంది. ఇప్పటికే, రెండేళ్లకు పైగా జైలు జీవితం గడుపుతున్న సత్యం రామలింగరాజు, బెయిల్ తో బయటకు వచ్చే అవకాశం లభించనుంది.
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి