15, జులై 2011, శుక్రవారం
కన్నవాళ్లు కాదు కసాయివాళ్లు
నవమోసాలు మోసింది.. పురిటినొప్పులు పడి కనింది. బిడ్డను చూడగానే అంతవరకూ పడ్డ కష్టం మాయైపోతుంది. అదే తల్లి గొప్పదనం. పసిపాప ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎంతో ఓర్పుగా ఉండడం తల్లదండ్రులకే చెల్లుతుంది. కానీ, కరీంనగర్లోని ఓ తల్లి మాత్రం, సహనాన్ని కోల్పోయింది. తన భర్తతో కలిసి మూడు నెలల పసికందును సంపులో పడేసి చంపేసింది. ఎందుకో తెలుసా..?
కరీంనగర్ .. భరత్ నగర్ ప్రాతం.. రవీందర్ స్వాతి దంపతుల చిన్న కుమార్తె చెర్రీ బుధవారం (13/07/11) రాత్రి కిడ్నాప్ అయ్యిందంటూ పోలీసులకు ఫిర్యాదు వచ్చింది. తన కుమార్తెను బిచ్చగాడు మత్తుమందు చల్లి ఎత్తుకెళ్లాడని చెప్పింది స్వాతి.. తల్లే ఆ మాట చెప్పడంతో అంతా నిజమననుకున్నారు. ఆ మాటలను నమ్మారు. కిడ్నాపే కావచ్చంటూ పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. రెండు రోజులు గడిచాయి. దర్యాప్తు ముమ్మరంగా చేసిన పోలీసులు, రవీందర్ ఇంటి సంపులోనే చెర్రీ మృతదేహాన్ని కనిపెట్టారు. మూడునెలల చిన్నారి శవంగా కనిపించడంతో అంతా అవాక్కయ్యారు. బిచ్చగాడు ఎత్తుకెళ్లిన పసిపాప, సొంతింటి సంపులోనే ఎలా శవంగా తేలింది
అంతే, తమదైన స్టైల్లో ఎక్వైరీ చేసే సరికి నిజం ఒప్పుకున్నారు చెర్రీ తల్లిదండ్రులు. పుట్టినప్పటినుంచీ ఎప్పుడూ ఏడుస్తూ తమకు సుఖం లేకుండా చేసిందని, నిద్రమందు ఇస్తే తప్ప నిద్ర పోదని, మందులు కొనడానికి తమ ఆర్థిక పరిస్థితి బాగా లేదని, అందుకే చంపేశానని చావు కబురు చల్లగా చెప్పాడు చెర్రీ తండ్రి రవీందర్. అంతేకాదు.. పేగుబంధాన్ని మర్చిపోయి మరీ, కన్నతల్లే ఆ పసిపాపను సంపులో పడేసింది. నిజం బయటపడుతుందన్న భయంతో కిడ్నాప్ డ్రామా ఆడింది.. కానీ, పిల్ల ఏడిస్తే చంపేస్తారా..? అమ్మానాన్నలకు అర్థం ఇదేనా.? ఓ పసిపాప ప్రాణం తీయడానికి మనసెలా వచ్చింది..?
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
సతీష్ గారు కన్న తల్లిదండ్రులు అలా ఎందుకు చేశారంటారు?
శ్రీనివాస్ గారు,
నమస్కారం, బాగున్నారా.. చాలాకాలమయ్యింది మీరు కామెంట్ చేసి. ఆవేశం ఎంత అనర్థమో ఈ సంఘటనే ఓ ఉదాహరణ. ఇక్కడ రెండు కారణాలను మనం గమనించవచ్చు. లాలించి బుజ్జగించి ఊరుకోబెట్టాల్సిన తల్లే చంపిందంటే, ఆమె ఎంత క్షోభను అనుభవించిందో అర్థం చేసుకోవాలి. అయితే.. ఓ పిచ్చినమ్మకమూ ఇందులో ప్రధాన పాత్ర పోషించింది. చెర్రీ పుట్టినప్పటి నుంచీ తమకు కలిసిరాలేదన్న దురభిప్రాయం వారిలో కలిగింది. అందుకే, ఆ పసిపిల్లను చంపడానికి తెగించారు. కానీ, చెర్రీ మరణంతోనే వారి కలిసొచ్చిన రోజులు పోయాయి. ఇప్పుడు జైలుపాలయ్యారు. ఎందుకు చేసినా, ఎలా చేసినా, అభంశుభం తెలియని చిన్నారిని చంపడం ఘోరాతిఘోరమైన నేరం. అందుకు శిక్ష అనుభవించాల్సిందే. క్షణికావేశంలో వీరిద్దరూ చేసిన తప్పుకు, వారి పెద్ద కుమార్తె మూడేళ్ల మరో చిన్నపాప అనాథగా మారింది.
సతీష్ గారు
నమస్కారం బాగున్నాను. మీరు బాగున్నారా? సతీష్ గారు చెర్రి సంఘటన పరిశీలిస్తే ఇది కావాలని చేసినట్లు అగుపించడం లేదు. చెర్రి మర్నించిన తీరు చూస్తే కేవలం ఆవేశంలో,అనాలోచితంగా ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనగా తెలుస్తున్నది. పాప ఫోటోలను,తల్లిదండ్రుల ఫొటోలను (15/07/2011 ఈనాడు కరీంనగర్ టాబ్లాయిడ్)పరిశీలిస్తే పాపను ప్రేమతో చూసున్నట్లు అర్థంవుతుంది,కాని పాప ఏడుపు భరించలేక ఆ తల్లి తనను తాను మరచి కొట్టడంతో ప్రమాదవశాత్తు చెర్రి మరణించి ఉంటుంది.అయితే పాప మరణంతో షాక్కు గురైన వారు తమను తాము రక్షించుకోనే క్రమంలో కిడ్నాప్ డ్రామా ఆడి ఉండవచ్చు. పిల్లల అల్లరితో మానశిక ఆవేదనకు గురవడం వల్ల తాము ఏంచేస్తున్నమో తెలియని స్థితితో ఇలాంటి ఘోరాలు జరిగే అవకాశం ఉన్నది. చెర్రి విషయంలో సైతం తల్లి తనను తాను మరచి అదుపు తప్పడంతో జరిగిన ప్రమాదమే తప్ప వేరొకటి కాదు. అయితే పోలీసుల నుండి తమను తాము రక్షించుకునే క్రమంలో డ్రామా ఆడి దొరికి పోయారు. వారు నిజానికి కావాలని హత్య చేస్తే ఇంత సులభంగా దొరికి పోయేవారుకాదు.ఇక్కడ మీడియా సైతం అత్యుత్సహాన్ని ప్రదర్శించడం భాదాకరం. ఖచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు తెలియజేయాల్సిన భాద్యత జర్నయిస్టులది. ఐతె ఒక సంఘటన జరగగానే తమ పాండిత్యన్ని ప్రదర్శించడం విచారకరం. యతి ప్రాసలతో, సినిమా డైలాగులతో (16/07/11 సాక్షి కరీంనగర్ టాబ్లాయిడ్ చూడండి)మీది ఆడజన్మే కదమ్మా? (ఇది అధినేత సినిమాలోని జగపతి బాబు డైలాగ్) అంటూ మానశికంగా కుళ్లబొడవడం ఎలాంటి జర్నలిజం? ఏది ఏమైనా తెలిసి చేసినా తెలియక చేసిన శిక్ష అనుభవించక తప్పదు. నిప్పుల్లో చేతులు పెట్టారు కాలకుండ ఉండదుకదా? చిన్నారి చెర్రి సంఘటన ఇలాంటి తల్లిదండ్రులకు కనువిప్పు కావాలని ఆశిస్తున్నాను.