పెట్రోల్ ధరలు ఎప్పడెప్పుడు పెరుగుతాయా? అని వాళ్లకు ఒకటే ఆశ. ఇలా కోరుకొంటోంది సామాన్యులు కాదు. పెట్రోల్ అమ్ముకుంటూ.. ఎప్పుడూ వేలకోట్ల నష్టాల్లో ఉన్నామని మొసలి కన్నీళ్లు కార్చే పెట్రోలియం కంపెనీలూ కాదు.. సామాన్యుల తరపున పోరాడతామని చెప్పుకునే రాజకీయపార్టీలు.
అవును, ఏ విషయం లేనప్పుడు తమ ఉనికి చాటుకోవడానికి, రాజకీయంగా హడావిడి చేయడానికి, వాటికి పనికొచ్చేది పెట్రోల్ ధరలే పెంపే. మీడియాలో ఓ రోజంతా కనిపించవచ్చు. కేంద్రప్రభుత్వాన్ని, రాష్ట్రప్రభుత్వాన్ని కావల్సినంత తిట్టి పొద్దు గడపొచ్చు. ఆ తర్వాత ఓ పదిమందిని వెంటేసుకొని, సబ్ కలెక్టర్ కార్యాలయం ముందో, కలెక్టర్ కార్యాలయం ముందో.. లేదంటే, ఓ జంక్షన్లోనో కాసేపు ధర్నా, రాస్తారోకోలు చేసి, జనాన్ని ఇబ్బందిపెట్టడం. ఇదో రోటీన్ ప్రాసెస్ అయిపోయింది. ఈ ధర్నాలతో ఏం సాధిస్తారు.? ఇక అవకాశం వస్తే గంటల దీక్షకు దిగే జగన్.. పెట్రోల్ పెంపును నిరసిస్తూ దీక్ష చేస్తారట. ఆయన దీక్షకు ఢిల్లీపీఠం గజగజలాడిపోయి దిగివచ్చేస్తుందా..? అధికారం అందేవరకూ అన్ని పార్టీలు ఇదే గోలా చేస్తాయి. మన రాష్ట్రంలో పెట్రోలియం ఉత్పత్తులపై అత్యధికపన్నులు విధిస్తున్నారంటూ వాపోతున్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడు.. ఈ పన్నులు ఎందుకు తగ్గించలేదు.? ఒకవేళ మళ్లీ అధికారంలోకి వచ్చినా వీటిని తగ్గిస్తారన్న ఆశా లేదు. ఒకవేళ అప్పుడు పెట్రోల్ ధరలు పెరిగితే.. కాంగ్రెస్ నేతలూ దాన్ని నిరసిస్తూ రోడ్డెక్కుతారు. మధ్యలో పిచ్చోళ్లయ్యేది జనాలే.
అంతేకాదు.. ఇప్పుడు ధరల పెంపుపై జనంలోనూ పెద్దగా స్పందన ఉండడం లేదు. పెట్రోల్ ధర పెరిగిందని బైక్ నో, కారునో ఇంట్లో పెట్టివచ్చేవాళ్లే లేరు. ధర ఎంతైనా పోయించుకునేది పోయించుకోవడమే.. తిరిగేది తిరగడమే. పార్టీలకూ ఈ విషయం అర్థమైనట్లుంది. అందుకే.. అంతా మొక్కుబడి వ్యవహారంగా మారిపోయింది. ఐదేళ్ల పాటు పెంచడం.. ఎన్నికల ముందు.. ఒకటో రెండో రూపాయలు తగ్గించడం.. అంతే.. జనంలో వ్యతిరేకత మాయమైపోతోంది. వాట్ ఎ స్ట్రాటజీ.. హ్యాట్సాఫ్ పొలిటికల్ లీడర్స్..
27, జూన్ 2011, సోమవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి