Pages

12, ఆగస్టు 2015, బుధవారం

లోకేశ్ పై తెలంగాణ ఏసీబీ నజర్

ఓటు కు నోటు కేసులో ఏసీబీ వేస్తున్న అడుగులు టీడీపీలో కలకలం రేపుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి, సండ్ర ను అరెస్ట్ చేసిన ఏసీబీ.. ఇప్పుడు టీడీపీలో కీలక నేత.. చంద్రబాబు వారసుడు లోకేశ్ ను లక్ష్యంగా చేసుకున్నట్లు కనిపిస్తోంది. ఓటుకు నోటు కేసు విచారణకు హాజరు కావాలంటూ.. లోకేశ్ కారు డ్రైవర్ కొండల్ రెడ్డికి నోటీసులు జారీ చేసింది. ఓటు కు నోటు డీల్ జరిగిన రోజు లోకేశ్ ఎవరెవరిని కలిశారన్నదానిపై ఏసీబీ కొండల్ రెడ్డిని ప్రశ్నించే అవకాశం ఉంది. కీలక వివరాలను రాబట్టగలిగితే.. ఆ తర్వాత లోకేశ్ కూ నోటీసులు జారీ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏసీబీ తాజా నోటీస్ వ్యవహారంపై అప్పుడు టీడీపీలో టెన్షన్ మొదలయ్యింది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి