టీడీపీ అధినేత చంద్రబాబు తనయుడు లోకేశ్ని తెలంగాణ ఏసీబీ టార్గెట్ చేసుకోగానే.. ఏపీ సీఐడీ నుంచి ప్రతీకార చర్యలు మొదలైనట్లు కనిపిస్తోంది. లోకేశ్ కారు డ్రైవర్ కు తెలంగాణ ఏసీబీ నోటీసులు ఇస్తే.. కేసీఆర్ తనయుడు మంత్రి కేటీఆర్ కారు డ్రైవర్ కు, గన్ మెన్ కు ఏపీ సీఐడీ నోటీసులు అందించింది. ఓటుకు నోటు కేసులో మత్తయ్యను చంద్రబాబు పేరు చెప్పాలంటూ బెదిరించారని నమోదైన కేసులో ఈ నోటీసులు జారీ చేసింది సీఐడీ. కొన్నాళ్లుగా స్తబ్ధుగా ఉన్న ఓటుకు నోటు కేసు తాజానోటీసులతో మళ్లీ దుమారం రేపడం మొదలుపెట్టింది. అటు టీడీపీ, ఇటు టీఆర్ఎస్ రెండూ.. ఈ నోటీసుల వ్యవహారాన్ని రచ్చరచ్చ చేయడం ఖాయంగా కనిపిస్తోంది.
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి