సీఎం అయిన దగ్గర నుంచి అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు. రోజూ దాదాపు 18 గంటలకు పైగా ఆయన పనిచేస్తున్నారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకూ ఏదో రకంగా ప్రభుత్వ కార్యక్రమాలపై ఆయన పర్యవేక్షణ సాగుతోంది. క్యాంప్ ఆఫీస్ నుంచే కాన్ఫరెన్స్ లు, సమీక్షలు చేస్తున్నారు కేసీఆర్. అప్పుడప్పుడూ ఫామ్ హౌస్ కు వెళ్లినా.. ఓ పూటో.. ఓ రోజో ఉండి వచ్చేసేవాళ్లు. ఈ సారి మాత్రం నాలుగు రోజుల పాటు ఫామ్ హౌస్ లో మకాం వేయడమే అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. పైగా ఓటుకు నోటు కేసు, ఫోన్ ట్యాపింగ్ వివాదం, సెక్షన్ 8 రగడ, హైదరాబాద్ ను యూటీ చేయాలన్న డిమాండ్లు తెలంగాణ ప్రభుత్వాన్ని చుట్టుముట్టిన సమయంలో ఆయన సడన్ గా ఫామ్ హౌస్ కు వెళ్లిపోవడం కలకలం రేపుతోంది.
అయితే.. కేసీఆర్ టూర్ వ్యూహాత్మకమే కావచ్చంటున్నారు విశ్లేషకులు. గతంలో ఉద్యమ సమయంలోనూ సడన్ గా మాయమయ్యేవాళ్లు కేసీఆర్. కొన్నాళ్ల విరామం తీసుకుని వచ్చి ఏదో ఓ సంచలన ప్రకటన చేసేవారు. సంచలనాత్మక నిర్ణయాలను అమలు చేసేవాళ్లు. అవన్నీ ఉద్యమానికి ఊపిరి పోసినవే. ఇప్పుడు ఈ విరామం కూడా వ్యూహాత్మకే అన్నది చాలామంది అభిప్రాయం. ఓటు కు నోటు కేసును మళ్లించే దిశగా ఆయన ఏదైనా వ్యూహరచన చేస్తుండవచ్చు. ఇప్పటికే ఈ విషయంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్, డీజీపీ అనురాగ్ శర్మలతోనూ ఫామ్ హౌస్ లోనే చర్చలు జరిపారు కేసీఆర్. ఇక నిత్యం వచ్చే రాజకీయ నాయకులతోనూ చర్చలు సాగుతున్నాయి. ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తూ.. కీలక ప్రకటన ఏదైనా చేయవచ్చన్న ఊహాగానాలు టీఆర్ఎస్ పార్టీలో జోరుగా సాగుతున్నాయి.
అయితే.. కేసీఆర్ టూర్ వ్యూహాత్మకమే కావచ్చంటున్నారు విశ్లేషకులు. గతంలో ఉద్యమ సమయంలోనూ సడన్ గా మాయమయ్యేవాళ్లు కేసీఆర్. కొన్నాళ్ల విరామం తీసుకుని వచ్చి ఏదో ఓ సంచలన ప్రకటన చేసేవారు. సంచలనాత్మక నిర్ణయాలను అమలు చేసేవాళ్లు. అవన్నీ ఉద్యమానికి ఊపిరి పోసినవే. ఇప్పుడు ఈ విరామం కూడా వ్యూహాత్మకే అన్నది చాలామంది అభిప్రాయం. ఓటు కు నోటు కేసును మళ్లించే దిశగా ఆయన ఏదైనా వ్యూహరచన చేస్తుండవచ్చు. ఇప్పటికే ఈ విషయంలో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్, డీజీపీ అనురాగ్ శర్మలతోనూ ఫామ్ హౌస్ లోనే చర్చలు జరిపారు కేసీఆర్. ఇక నిత్యం వచ్చే రాజకీయ నాయకులతోనూ చర్చలు సాగుతున్నాయి. ఫామ్ హౌస్ నుంచి బయటకు వస్తూ.. కీలక ప్రకటన ఏదైనా చేయవచ్చన్న ఊహాగానాలు టీఆర్ఎస్ పార్టీలో జోరుగా సాగుతున్నాయి.
కామెంట్ను పోస్ట్ చేయండి