మనం పీల్చే గాలి విషం.. మనం ఉండే నేల విషం.. మనం చూసే ఆకాశం విషం.. మనం తాగే నీరు కూడా విషమే. చివరకు వర్థాలను కాల్చడంవల్ల ఎగసిపడే అగ్నికీలలూ విషాన్నే వెల్లగక్కుతున్నాయి. చెప్పాలంటే.. పంచభూతాలూ విషమయమైపోయాయి.
మన దేశంలో ఉపరితల నీటిలో 80 శాతం కాలుష్య భరితమేనని తేల్చింది తాజా పరిశోధన. భారత పట్టణాభివృద్ధి శాఖ, భారత కాలుష్య నియంత్రణ మండలి సేకరించిన వివరాల ఆధారాలను బట్టి.. దేశం మొత్తం మీద 75-80 శాతం ఉపరితల నీరు కాలుష్యమయమై పోయింది. మానవవ్యర్థాలు, ఇళ్లనుంచి వస్తున్న మురుగు నీరు, పట్టణ మురుగునీరు అంతా నదులు, చెరువుల్లో చేరడం వల్ల ఈ ప్రమాదకర పరిస్థితి వచ్చిందంటోంది. ఎక్కడా ఈ మురుగు నీటిని ట్రీట్మెంట్ చేయకుండానే వదిలేయడం వల్ల. .స్వచ్ఛమైన నీరు కాస్తా కాలుష్య భరితమైపోతుందని హెచ్చరించింది. ఈ నీటినే మళ్లీ తాగునీటి అవసరాలకు ఉపయోగించడం వల్ల కలరా, డయేరియా, కామెర్లు లాంటి ప్రమాదకర వ్యాధులు ప్రబలుతున్నాయంటోంది తాజా సర్వే.
మన దేశంలో ఉపరితల నీటిలో 80 శాతం కాలుష్య భరితమేనని తేల్చింది తాజా పరిశోధన. భారత పట్టణాభివృద్ధి శాఖ, భారత కాలుష్య నియంత్రణ మండలి సేకరించిన వివరాల ఆధారాలను బట్టి.. దేశం మొత్తం మీద 75-80 శాతం ఉపరితల నీరు కాలుష్యమయమై పోయింది. మానవవ్యర్థాలు, ఇళ్లనుంచి వస్తున్న మురుగు నీరు, పట్టణ మురుగునీరు అంతా నదులు, చెరువుల్లో చేరడం వల్ల ఈ ప్రమాదకర పరిస్థితి వచ్చిందంటోంది. ఎక్కడా ఈ మురుగు నీటిని ట్రీట్మెంట్ చేయకుండానే వదిలేయడం వల్ల. .స్వచ్ఛమైన నీరు కాస్తా కాలుష్య భరితమైపోతుందని హెచ్చరించింది. ఈ నీటినే మళ్లీ తాగునీటి అవసరాలకు ఉపయోగించడం వల్ల కలరా, డయేరియా, కామెర్లు లాంటి ప్రమాదకర వ్యాధులు ప్రబలుతున్నాయంటోంది తాజా సర్వే.
కామెంట్ను పోస్ట్ చేయండి