|
నిత్యానందరెడ్డిపై కాల్పులకు పాల్పడ్డ అసలు ఓబులేశు |
హైదరాబాద్ లోని కేబీఆర్ పార్క్ దగ్గర అరబిందో ఫార్మా వైస్ ఛైర్మన్ నిత్యానందరెడ్డిపై కాల్పులకు పాల్పడింది గ్రేహౌండ్స్ కానిస్టేబుల్ ఓబులేసని ముందే తెల్చేశారు పోలీసులు. సరిగ్గా అక్కడే మొదలయ్యింది మీడియా హడావుడి. ఓబులేశంటూ ఓ వ్యక్తి ఫోటోను ప్రసారం చేసింది. పార్క్ లో స్టైల్ గా కూర్చుని ఉన్న ఆ ఫోటో ను అన్నిఛానళ్లు ప్రసారం చేశాయి. వీడేం పోలీస్ అంటూ టైటిల్స్ పెట్టాయి. నానా హంగామా చేశాయి. కానీ.. సీన్ కట్ చేస్తే.. ఆ ఫోటో ఉన్న వ్యక్తికి పోలీసులు పట్టుకున్న వ్యక్తికి అసలు పొంతనే లేదు. పోలిక అసలేలేదు. ఇక్కడే ఓ విచిత్రం చోటు చేసుకుంది.
|
మీడియా ఛానళ్లు ప్రసారం చేసిన ఓబులేశు ఫోటో. ఇతడికి కాల్పుల కేసుకు సంబంధం లేదు. |
మీడియా ప్రసారం చేసిన ఫోటో ఓబులేశుదే.. పోలీసులు అరెస్ట్ చేసింది కూడా ఓబులేశునే. కానీ.. వారిద్దరూ ఒకరు కాదు.వేరు వేరు. ఇందులో ఇంకో విచిత్రం ఏమిటంటే.. ఇద్దరూ పోలీసులే కావడం. నిత్యానందరెడ్డిపై కాల్పులు జరిపింది గ్రౌహౌండ్స్ లో పనిచేసిన పి.ఓబులేశు. ఇక మీడియా ప్రసారం చేసిన ఫోటోలోని వ్యక్తి ఎన్.ఓబులేశు. ఇతడు ఏపీఎస్పీ 14వ బెటాలియన్ లో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్నాడు. తనకు ఈ కాల్పుల కేసుతో అసలు సంబంధం లేదని.. అలాంటప్పుడు తన ఫోటోను నిందితుడంటూ ఎలా ప్రసారం చేస్తారంటూ ఫైర్ అయ్యాడు. టీవీ ఛానళ్ల పనితో తన పరువుమొత్తం పోయిందంటూ గగ్గోలు పెడుతున్నాడు.
కామెంట్ను పోస్ట్ చేయండి