ఆంధ్రప్రదేశ్ రాజధాని నిర్మాణానికి భూసమీకరణ ప్రయత్నాల్లో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం.. రైతులను ఒప్పించే విషయంలో మరో వ్యూహం అమలు చేస్తోంది. ప్రభుత్వ హామీలపై నమ్మకం లేని రైతులు భూములు ఇవ్వమంటూ ఇప్పటికే చాలా గ్రామాల్లో ఆందోళన చేస్తున్నారు. గ్రామాల్లో నిర్వహిస్తున్న ప్రజాభిప్రాయసేకరణ సభలు కూడా రసాభాసగా మారుతున్నాయి. చాలాచోట్ల అధికారులపై ఎదురుతిరుగుతున్నారు జనం. తమకున్న కొద్దిపాటి భూములను ఇవ్వమని తేల్చి చెబుతున్నారు. అయితే.. ప్రభుత్వం మాత్రం ఎలాగైనా ఈభూములను తీసుకోవాలనుకొంటోంది. దీనికోసం సీఎం చంద్రబాబుతో రైతుల ముఖాముఖీని ఏర్పాటు చేసింది. రాజధానికి భూసమీకరణ చేపట్టనున్న గ్రామాల్లో.. ఒక్కో గ్రామం నుంచి ఐదుగురి చొప్పున ఎంపిక చేసి హైదరాబాద్కు రప్పిస్తోంది. అయితే... ఇక్కడే చక్రం తిప్పుతున్నారు అధికార పార్టీ నాయకులు. భూములు ఇవ్వడానికి అనుకూలంగా ఉన్నవారిని మాత్రమే బస్సుల్లో ఎక్కించి హైదరాబాద్ పంపించారు. భూములు ఇవ్వమనే రైతులు కొంతమంది బస్సులు ఎక్కినా.. వారిని మధ్యలోనే దింపేశారు. చంద్రబాబు దగ్గర భూములు ఇస్తామని, మెరుగైన ప్యాకేజీ ఇవ్వాలని మాత్రమే అడగాలంటూ రైతులకు ఆదేశాలు జారీచేసినట్లు సమాచారం. దీనిపై గ్రామాల్లో ఉన్న రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
18, నవంబర్ 2014, మంగళవారం
వాళ్లకు మాత్రమే ఆహ్వానమా..?
Categories :
ap capital . chandrababu . farmers . land pooling . POLITICS . vijayawada
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి