జయలలిత ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో.. మ్యూజిక్ మాంత్రికుడు ఏ.ఆర్.రెహ్మాన్ కూడా సాక్ష్యం చెప్పారు. ఈ కేసులో ఎంతోమంది వీఐపీలను విచారించింది కోర్టు. జయలలిత దత్తపుత్రుడు సుధాకరన్ వివాహానికి భారీగా ఖర్చుపెట్టిన జయలలిత.. అప్పట్లో అందర్నీ వాడేశారు. ఆ వివాహంలో ఫ్రీగా మ్యూజిక్ కొట్టారట రెహ్మాన్. అప్పట్లే తనకు వెండితో చేసిన శుభలేఖ పంపించారని సాక్ష్యం చెప్పారట ఆయన. రెహ్మాన్ తో పాటు, మాండలిన్ మాంత్రికుడు , ఇటీవలే కన్నుమూసిన శ్రీనివాస్ కూడా ఈ వివాహంలో తన కళాప్రదర్శన చేశారట. ఆయన కూడా కోర్టుకు హాజరై సాక్ష్యం చెప్పారు.
ఇక ఈ కేసులోనే కోర్టు ముందు హాజరైన ఇళయరాజా చిన్న తమ్ముడు గంగాయ్ అమరన్ కీలక వివరాలను వెల్లడించారు. పయ్యనూర్ లో ఉన్న తన 22 ఎకరాల ఫామ్ హౌస్ ను 1994లో శశికళకు అమ్మాల్సి వచ్చిందని చెప్పారాయన. ఇది తనకు ఇష్టం లేకపోయినా.."అమ్మకు మీ ఫామ్ హౌస్ చాలా నచ్చింది" అని శశికళ చెప్పి, బలవంతగా తన దగ్గర నుంచి కొనుగోలు చేశారని వాపోయారాయన. దీనికోసం కేవలం 13.1 లక్షల డిమాండ్ డ్రాప్ట్ ను మాత్రమే ఇచ్చారని కోర్టుకు చెప్పారు అమరన్. ఆ సమయంలో జయలలిత ముఖ్యమంత్రిగా ఉండడంతో దీన్ని అధికార దుర్వినియోగంగానే పరిగణనలోకి తీసుకుంది కోర్టు.
ఇక ఈ కేసులోనే కోర్టు ముందు హాజరైన ఇళయరాజా చిన్న తమ్ముడు గంగాయ్ అమరన్ కీలక వివరాలను వెల్లడించారు. పయ్యనూర్ లో ఉన్న తన 22 ఎకరాల ఫామ్ హౌస్ ను 1994లో శశికళకు అమ్మాల్సి వచ్చిందని చెప్పారాయన. ఇది తనకు ఇష్టం లేకపోయినా.."అమ్మకు మీ ఫామ్ హౌస్ చాలా నచ్చింది" అని శశికళ చెప్పి, బలవంతగా తన దగ్గర నుంచి కొనుగోలు చేశారని వాపోయారాయన. దీనికోసం కేవలం 13.1 లక్షల డిమాండ్ డ్రాప్ట్ ను మాత్రమే ఇచ్చారని కోర్టుకు చెప్పారు అమరన్. ఆ సమయంలో జయలలిత ముఖ్యమంత్రిగా ఉండడంతో దీన్ని అధికార దుర్వినియోగంగానే పరిగణనలోకి తీసుకుంది కోర్టు.
కామెంట్ను పోస్ట్ చేయండి