వాళ్లేమీ దోచుకోవడానికి రాలేదు.. వాళ్ల డిమాండ్ ఏమీ అన్యాయమో, అంతకన్నా అక్రమమో కాదు. వారికి కావాల్సింది పంటకు ప్రతిఫలం. కానీ, ఫ్యాక్టరీ పెద్దలకు మాత్రం డబ్బు ఇవ్వాలన్న ఆలోచనే ేదు. చెప్పాలంటే.. రైతులను మోసం చేస్తూ కాలం గడిపేస్తున్నారు.. మరి పోలీసులు అరెస్ట్ చేయాల్సింది రైతులనా.. ఫ్యాక్టరీ పెద్దలనా..
బుర్రలో ఏమాత్రం ఇంగితజ్ఞానం ఉన్న ఎవరైనా మోసానికి పాల్పడ్డ ఫ్యాక్టరీ యాజమాన్యాన్నే అరెస్ట్ చేయాలని చెబుతారు. కానీ ఏపీ ప్రభుత్వ పెద్దలకు, విజయనగరం జిల్లా పోలీసులకు, అధికారులకు ఈ ఇంగితజ్ఞానమే లేకపోయింది. అందుకే, ధర్నా చేస్తున్న రైతులను అరెస్ట్ చేసి జైల్లో పడేసి ఫ్యాక్టరీ పెద్దలకు రక్షణ గోడ కట్టేశారు.
విజయనగరం జిల్లాలోని ఎన్సీఎస్ ఫ్యాక్టరీకి ఆరు నెలల క్రితం చెరుకును అమ్మారు రైతులు. వాటిలో దాదాపు 25 కోట్ల మేర ఇంకా బకాయిలు చెల్లించాల్సి ఉంది. చెరుకును క్రషింగ్ చేసుకుని, చక్కెరను అమ్ముకున్న యాజమాన్యం రైతులకు బిల్లులు మాత్రం చెల్లించలేదు. పైగా, రైతుల భూములనే చాలా బ్యాంకుల్లో తనఖా పెట్టుకుని అప్పులు కూడా తీసుకుంది. ఫ్యాక్టరీ యాజమాన్యంపై వెంటనే కేసులు పెట్టి అరెస్ట్ చేయాల్సింది పోయి, ఇంకా మీనమేషాలు లెక్కపెడుతోంది అధికారగణం. ఫ్యాక్టరీకి చెందిన 75 ఎకరాల భూములను స్వాధీనం చేసుకున్నామని,వాటిని వేలం వేసి రైతుల బిల్లులు కడతామని చెబుతోంది. అయితే, ఇప్పటికే ఎన్నోసార్లు అధికారులు కూడా మాట తప్పినందున, ఈ సారి వేలం జరగుతుందన్న నమ్మకం రైతులకు లేదు. అందుకే, వెంటనే బిల్లులు కట్టాలంటూ డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. అయితే, ఫ్యాక్టరీకి పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసి రైతులను అరెస్ట్ చేశారు. దీనిపైనే మండిపడుతున్నారు రైతు సంఘం నాయకులు.
బుర్రలో ఏమాత్రం ఇంగితజ్ఞానం ఉన్న ఎవరైనా మోసానికి పాల్పడ్డ ఫ్యాక్టరీ యాజమాన్యాన్నే అరెస్ట్ చేయాలని చెబుతారు. కానీ ఏపీ ప్రభుత్వ పెద్దలకు, విజయనగరం జిల్లా పోలీసులకు, అధికారులకు ఈ ఇంగితజ్ఞానమే లేకపోయింది. అందుకే, ధర్నా చేస్తున్న రైతులను అరెస్ట్ చేసి జైల్లో పడేసి ఫ్యాక్టరీ పెద్దలకు రక్షణ గోడ కట్టేశారు.
విజయనగరం జిల్లాలోని ఎన్సీఎస్ ఫ్యాక్టరీకి ఆరు నెలల క్రితం చెరుకును అమ్మారు రైతులు. వాటిలో దాదాపు 25 కోట్ల మేర ఇంకా బకాయిలు చెల్లించాల్సి ఉంది. చెరుకును క్రషింగ్ చేసుకుని, చక్కెరను అమ్ముకున్న యాజమాన్యం రైతులకు బిల్లులు మాత్రం చెల్లించలేదు. పైగా, రైతుల భూములనే చాలా బ్యాంకుల్లో తనఖా పెట్టుకుని అప్పులు కూడా తీసుకుంది. ఫ్యాక్టరీ యాజమాన్యంపై వెంటనే కేసులు పెట్టి అరెస్ట్ చేయాల్సింది పోయి, ఇంకా మీనమేషాలు లెక్కపెడుతోంది అధికారగణం. ఫ్యాక్టరీకి చెందిన 75 ఎకరాల భూములను స్వాధీనం చేసుకున్నామని,వాటిని వేలం వేసి రైతుల బిల్లులు కడతామని చెబుతోంది. అయితే, ఇప్పటికే ఎన్నోసార్లు అధికారులు కూడా మాట తప్పినందున, ఈ సారి వేలం జరగుతుందన్న నమ్మకం రైతులకు లేదు. అందుకే, వెంటనే బిల్లులు కట్టాలంటూ డిమాండ్ చేస్తూ ఆందోళనకు దిగారు. అయితే, ఫ్యాక్టరీకి పూర్తిస్థాయిలో బందోబస్తు ఏర్పాటు చేసి రైతులను అరెస్ట్ చేశారు. దీనిపైనే మండిపడుతున్నారు రైతు సంఘం నాయకులు.
కామెంట్ను పోస్ట్ చేయండి