ఆంధ్రప్రదేశ్ రాజధానిపై నెలకొన్న ఉత్కంఠ మరికాసేపట్లో తొలిగిపోనుంది. ముహూర్తం ప్రకారం 12 గంటల 17 నిమిషాలకు ఏపీ సీఎం చంద్రబాబు , రాజధానిపై అసెంబ్లీలో ప్రకటన చేయనున్నారు. అయితే, ఆయన నోటినుంచి ఏ ప్రాంతం పేరు వస్తుందన్నదే ఇప్పుడు మరింత టెన్షన్ రేకెత్తిస్తోంది.
విజయవాడ-గుంటూరు మధ్యే రాజధాని అంటూ చాలాకాలంగా చంద్రబాబు సహా టీడీపీ నేతలు చెప్పుకుంటూనే వస్తున్నారు. ఈ ప్రాంతమైతేనే రాష్ట్రం మొత్తానికి మధ్యన ఉంటుందన్నది తెలుగుతమ్ముళ్ల అభిప్రాయం. అయితే.. ఈ రెండింటిని ఉమ్మడిగా రాజధానిగా ప్రకటిస్తారా.. లేక... రెండింటి మధ్యన ఉన్న మంగళగిరిని రాజధానిగా ప్రకటిస్తారా అన్నది తేలాల్సి ఉంది. అంతేకాదు, ఇక్కడ భూముల లభ్యత తక్కువగా ఉండడంతో, అమరావతిని గానీ, గన్నవరం, నూజివీడులను గానీ ప్రకటించవచ్చనీ వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ విషయంలో ఇంతవరకూ ఎలాంటి లీకులనూ ఇవ్వలేదు చంద్రబాబు. దీంతో.. అసెంబ్లీలో ఆయన ఎలాంటి ప్రకటన చేస్తారన్నది హాట్ టాపిక్ అయ్యింది. అయితే.. రాజధాని పేరు నేరుగా చెప్పకుండా, విజయవాడ-గుంటూరు మధ్య ఏర్పాటు చేస్తామని, సలహాలు, అభిప్రాయాలను చెప్పమంటూ సభను చంద్రబాబు కోరవచ్చన్న వాదనా వినిపిస్తోంది. దీంతో పాటు.. కమిటీల బాబుగా పేరున్న టీడీపీ అధినేత ఈ విషయంలో మరో కమిటీ వేసినా ఆశ్చర్యం లేదంటున్నారు తెలుగు తమ్ముళ్లు.
విజయవాడ-గుంటూరు మధ్యే రాజధాని అంటూ చాలాకాలంగా చంద్రబాబు సహా టీడీపీ నేతలు చెప్పుకుంటూనే వస్తున్నారు. ఈ ప్రాంతమైతేనే రాష్ట్రం మొత్తానికి మధ్యన ఉంటుందన్నది తెలుగుతమ్ముళ్ల అభిప్రాయం. అయితే.. ఈ రెండింటిని ఉమ్మడిగా రాజధానిగా ప్రకటిస్తారా.. లేక... రెండింటి మధ్యన ఉన్న మంగళగిరిని రాజధానిగా ప్రకటిస్తారా అన్నది తేలాల్సి ఉంది. అంతేకాదు, ఇక్కడ భూముల లభ్యత తక్కువగా ఉండడంతో, అమరావతిని గానీ, గన్నవరం, నూజివీడులను గానీ ప్రకటించవచ్చనీ వాదనలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ విషయంలో ఇంతవరకూ ఎలాంటి లీకులనూ ఇవ్వలేదు చంద్రబాబు. దీంతో.. అసెంబ్లీలో ఆయన ఎలాంటి ప్రకటన చేస్తారన్నది హాట్ టాపిక్ అయ్యింది. అయితే.. రాజధాని పేరు నేరుగా చెప్పకుండా, విజయవాడ-గుంటూరు మధ్య ఏర్పాటు చేస్తామని, సలహాలు, అభిప్రాయాలను చెప్పమంటూ సభను చంద్రబాబు కోరవచ్చన్న వాదనా వినిపిస్తోంది. దీంతో పాటు.. కమిటీల బాబుగా పేరున్న టీడీపీ అధినేత ఈ విషయంలో మరో కమిటీ వేసినా ఆశ్చర్యం లేదంటున్నారు తెలుగు తమ్ముళ్లు.
కామెంట్ను పోస్ట్ చేయండి