రుణమాఫీకి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి శాసనమండలిలో కొత్త భాష్యం చెప్పారు. చంద్రబాబు ప్రమాణస్వీకారం చేసిన రోజునే మాఫీపై ఓ కమిటీని ఏర్పాటు చేశారన్న ఆమె, దాన్ని పొయ్యి ఏర్పాటు చేయడం లాంటిదన్నారు. అన్నం పెట్టాలంటే ముందుగా పొయ్యి ఏర్పాటు చేసుకోవాలని, సీమాంధ్రలో ప్రస్తుతం పొయ్యి లేదన్నారు నన్నపనేని. అందులో మంట పెట్టాలని, బియ్యంలో రాళ్లు ఏరాలని, కడగి వండాలని, ఆ తర్వాత ఆ అన్నంలోకి కాస్త పచ్చడైనా వేయాల్సి ఉంటుందన్నారామె. అంటే, రైతురుణమాఫీని అమలు చేయడానికి ఇంత ప్రాసెస్ ఉంటుందని చెప్పకనే చెప్పారు రాజకుమారి.
23, జూన్ 2014, సోమవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
కామెంట్ను పోస్ట్ చేయండి