మహా ప్రస్థానం ముగిసింది. సుమారు ఆరు దశాబ్దాల పాటు కలిసి ఉన్న తెలుగునేల విడిపోతోంది. జూన్ 2న తెలంగాణ రాష్ట్రం అధికారికంగా తెరపైకి రాబోతోంది. దశాబ్దాల తరబడి సాగిన ఉద్యమాలు, పోరాటాలు, ఎంతోమంది అమరుల త్యాగాలకు అసలైన నివాళి లభించబోతోంది. ఇంతవరకూ సెప్టెంబర్17ను విమోచన దినోత్సవంగా ఘనంగా జరుపుకున్న తెలంగాణ వాదులు, ఇకపై జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవంగా జరుపుకోబోతున్నారు. తెలంగాణ వరకూ అంతా బాగానే ఉన్నా.. ఆంధ్రప్రదేశ్ అవతరణ దినోత్సవం ఏదన్నదే ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది.
రాష్ట్రం విడిపోవడం సీమాంధ్ర ప్రజలకు ఏమాత్రం ఇష్టం లేదు. కాబట్టి జూన్ 2 వారికి సంబంధించినంతవరకూ విద్రోహ దినమే తప్ప అవతరణ దినోత్సవం కాదు. ఇక చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే జూన్ 8ని కూడా అవతరణ దినోత్సవంగా స్వీకరిస్తారా లేదా అన్నదీ అనుమానమే. ఇంతవరకూ జరుపుకుంటూ వచ్చిన నవంబర్ 1 కి ఇకపై ప్రాధాన్యత ఉండనే ఉండదు. ఎందుకంటే, అది ఆంధ్రరాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రాలు కలిసి ఆంధ్రప్రదేశ్ గా అవతరించిన సందర్భం. ఇప్పుడు హైదరాబాద్ స్టేట్ కు సంబంధించిన ఏ ప్రాంతమూ ఆంధ్రప్రదేశ్ లో భాగం కాదు కాబట్టి, నవంబర్ 1 ఆ అర్హత కోల్పోయింది. పోనీ ఆంధ్ర రాష్ట్రం అవతరించిన అక్టోబర్ 1ని జరుపుకుందామంటే, దానికీ ఇప్పుడు పెద్దగా ప్రాధాన్యం ఉండదు. ఎందుకంటే, అక్టోబర్ 1కి ఇప్పటి పరిస్థితులకు ఏమాత్రం సంబంధం లేదు. దీంతో, కొత్త ప్రభుత్వం రాష్ట్ర దినోత్సవంగా దేన్ని ఎంపిక చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రపతి పాలన ముగిసి ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి, అందులోనూ చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు కాబట్టి, జూన్ 8నే చరిత్రలో మిగిలిపోయేలా చేయడానికి ఆ రోజునే అవతరణ దినోత్సవంగా ప్రకటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ, దానికి జనం నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నదే ఇప్పుడు ఉత్కంఠను కలిగిస్తోంది.
రాష్ట్రం విడిపోవడం సీమాంధ్ర ప్రజలకు ఏమాత్రం ఇష్టం లేదు. కాబట్టి జూన్ 2 వారికి సంబంధించినంతవరకూ విద్రోహ దినమే తప్ప అవతరణ దినోత్సవం కాదు. ఇక చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేసే జూన్ 8ని కూడా అవతరణ దినోత్సవంగా స్వీకరిస్తారా లేదా అన్నదీ అనుమానమే. ఇంతవరకూ జరుపుకుంటూ వచ్చిన నవంబర్ 1 కి ఇకపై ప్రాధాన్యత ఉండనే ఉండదు. ఎందుకంటే, అది ఆంధ్రరాష్ట్రం, హైదరాబాద్ రాష్ట్రాలు కలిసి ఆంధ్రప్రదేశ్ గా అవతరించిన సందర్భం. ఇప్పుడు హైదరాబాద్ స్టేట్ కు సంబంధించిన ఏ ప్రాంతమూ ఆంధ్రప్రదేశ్ లో భాగం కాదు కాబట్టి, నవంబర్ 1 ఆ అర్హత కోల్పోయింది. పోనీ ఆంధ్ర రాష్ట్రం అవతరించిన అక్టోబర్ 1ని జరుపుకుందామంటే, దానికీ ఇప్పుడు పెద్దగా ప్రాధాన్యం ఉండదు. ఎందుకంటే, అక్టోబర్ 1కి ఇప్పటి పరిస్థితులకు ఏమాత్రం సంబంధం లేదు. దీంతో, కొత్త ప్రభుత్వం రాష్ట్ర దినోత్సవంగా దేన్ని ఎంపిక చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. రాష్ట్రపతి పాలన ముగిసి ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి, అందులోనూ చంద్రబాబు సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారు కాబట్టి, జూన్ 8నే చరిత్రలో మిగిలిపోయేలా చేయడానికి ఆ రోజునే అవతరణ దినోత్సవంగా ప్రకటించే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కానీ, దానికి జనం నుంచి ఎలాంటి స్పందన వస్తుందన్నదే ఇప్పుడు ఉత్కంఠను కలిగిస్తోంది.
కామెంట్ను పోస్ట్ చేయండి