కాంగ్రెస్ చరిత్రలోనే కనీవినీ ఎరుగని రీతిలో గుణపాఠం చెప్పారు దేశ ఓటర్లు. కేవలం 46 సీట్లకే పరిమితం చేసి, ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేసి కసి తీర్చుకున్నారు. అటు చాలాకాలం తర్వాత ఏక పార్టీకి మెజార్టీ కట్టబెట్టిన అన్ని రాష్ట్రాల ఓటర్లు, కేంద్రంలో బలమైన ప్రభుత్వాన్ని, బలమైన ప్రధానిని ఎన్నుకున్నారు. ఫలితాలను చూసి దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం .. జనానికి ముఖం చూపించలేకపోతోంది.
మోడీని విధ్వంసకర శక్తిగా చూపించడానికి ప్రయత్నించి దానిపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ హైకమాండ్, దానికి తగ్గ మూల్యమే చెల్లించుకుంది. ఎప్పుడూ లేనంతగా దేశం ఒక్కటై, మోడీకి భారీ మెజార్టీ కట్టబెట్టింది. 285 సీట్లలో బీజేపీ అభ్యర్థులను గెలిపించి, ఎవరి దయాదాక్షిణ్యాలమీద బతకకుండా సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోమంటూ ఆశీర్వదించింది.
మోడీని విధ్వంసకర శక్తిగా చూపించడానికి ప్రయత్నించి దానిపైనే ఎక్కువగా ఫోకస్ పెట్టిన కాంగ్రెస్ హైకమాండ్, దానికి తగ్గ మూల్యమే చెల్లించుకుంది. ఎప్పుడూ లేనంతగా దేశం ఒక్కటై, మోడీకి భారీ మెజార్టీ కట్టబెట్టింది. 285 సీట్లలో బీజేపీ అభ్యర్థులను గెలిపించి, ఎవరి దయాదాక్షిణ్యాలమీద బతకకుండా సొంత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోమంటూ ఆశీర్వదించింది.
కామెంట్ను పోస్ట్ చేయండి