బుద్ధపౌర్ణిమ వెళ్లి రెండు రోజులయ్యిందో లేదో.. అటు సీమాంధ్ర, ఇటు తెలంగాణ రెండు చోట్లా చంద్రోదయం అయ్యింది. అవును.. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు అధికారం అందుకుంటే.. తెలంగాణలో కె.చంద్రశేఖర్ రావు జయకేతనం ఎగరవేశారు. ఇద్దరి పేర్లలోనూ చంద్ర ఉండడం.. రెండు కొత్త రాష్ట్రాల్లో అధికారం అందుకోవడం విశేషమే మరి.
తెలంగాణలో పోటాపోటీగా ఎన్నికలు జరిగాయంటూ సర్వేలు చెప్పినా, కాంగ్రెస్ నేతలు తమదే విజయం అన్నా.. ప్రజాతీర్పు మాత్రం వన్ సైడ్ గానే వచ్చింది. టీఆర్ఎస్ కు పూర్తి స్థాయిలో మెజార్టీని కట్టబెట్టిన తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ ను మాత్రం పాతిక మార్కును దాటనివ్వలేదు. చాలామంది మంత్రులు, పీసీసీ చీఫ్ కూడా చుక్కలు చూపించారు తెలంగాణ ఓటర్లు..
సీమాంధ్రలో మాత్రం రెండు రకాల తీర్పులొచ్చాయి. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో ఓటర్లు టీడీపీ పక్షాన నిలిస్తే, దక్షిణ కోస్తా, అనంత మినహా రాయలసీమ మిగిలిన మూడు జిల్లాల ప్రజలు మాత్రం వైసీపీ పక్షాన నిలబడ్డారు. జిల్లాల వారీగా టీడీపీ, వైసీపీ మధ్యే పోటీ నడిచింది. ఎక్కడా కాంగ్రెస్ ను ఖాతా తెరవనివ్వలేదు ఆంధ్ర ఓటర్లు.జిల్లాల వారీగా బలాబలాలు
శ్రీకాకుళం (10): టీడీపీ-7, వైసీపీ-3
విజయనగరం (9): టీడీపీ-6, వైసీపీ-3
విశాఖపట్నం (15): టీడీపీ-11, వైసీపీ-3, బీజేపీ-1
తూ.గో. (19): టీడీపీ-12, వైసీపీ-5, బీజేపీ-1, ఇండిపెండెంట్-1
ప.గో. (15): టీడీపీ-14, బీజేపీ-1
కృష్ణా (16): టీడీపీ-10, వైసీపీ-5, బీజేపీ-1
గుంటూరు (17): టీడీపీ-12, వైసీపీ-5
ప్రకాశం (12): వైసీపీ-6, టీడీపీ-5, ఇండిపెండెంట్-1
నెల్లూరు (10): వైసీపీ-7, టీడీపీ-3
చిత్తూరు (14): టీడీపీ-6, వైసీపీ-8
అనంతపురం (14): టీడీపీ-12, వైసీపీ-2
కడప (10): వైసీపీ-9, టీడీపీ-1
కర్నూలు (14): టీడీపీ-3, వైసీపీ-11
ఆళ్లగడ్డలో మాత్రం దివంగత నేత శోభానాగిరెడ్డినే గెలిపించారు అక్కడి ప్రజలు. ఆమె చనిపోయినా, ఆమెకు ఓటేస్తే ఉపఎన్నికలు వస్తాయని తెలిసినా, ఓటు ద్వారా ఆమెకు నివాళులు అర్పించారు ఆళ్లగడ్డ ఓటర్లు.
తెలంగాణలో పోటాపోటీగా ఎన్నికలు జరిగాయంటూ సర్వేలు చెప్పినా, కాంగ్రెస్ నేతలు తమదే విజయం అన్నా.. ప్రజాతీర్పు మాత్రం వన్ సైడ్ గానే వచ్చింది. టీఆర్ఎస్ కు పూర్తి స్థాయిలో మెజార్టీని కట్టబెట్టిన తెలంగాణ ప్రజలు, కాంగ్రెస్ ను మాత్రం పాతిక మార్కును దాటనివ్వలేదు. చాలామంది మంత్రులు, పీసీసీ చీఫ్ కూడా చుక్కలు చూపించారు తెలంగాణ ఓటర్లు..
సీమాంధ్రలో మాత్రం రెండు రకాల తీర్పులొచ్చాయి. ఉత్తరాంధ్ర, కోస్తా జిల్లాల్లో ఓటర్లు టీడీపీ పక్షాన నిలిస్తే, దక్షిణ కోస్తా, అనంత మినహా రాయలసీమ మిగిలిన మూడు జిల్లాల ప్రజలు మాత్రం వైసీపీ పక్షాన నిలబడ్డారు. జిల్లాల వారీగా టీడీపీ, వైసీపీ మధ్యే పోటీ నడిచింది. ఎక్కడా కాంగ్రెస్ ను ఖాతా తెరవనివ్వలేదు ఆంధ్ర ఓటర్లు.జిల్లాల వారీగా బలాబలాలు
శ్రీకాకుళం (10): టీడీపీ-7, వైసీపీ-3
విజయనగరం (9): టీడీపీ-6, వైసీపీ-3
విశాఖపట్నం (15): టీడీపీ-11, వైసీపీ-3, బీజేపీ-1
తూ.గో. (19): టీడీపీ-12, వైసీపీ-5, బీజేపీ-1, ఇండిపెండెంట్-1
ప.గో. (15): టీడీపీ-14, బీజేపీ-1
కృష్ణా (16): టీడీపీ-10, వైసీపీ-5, బీజేపీ-1
గుంటూరు (17): టీడీపీ-12, వైసీపీ-5
ప్రకాశం (12): వైసీపీ-6, టీడీపీ-5, ఇండిపెండెంట్-1
నెల్లూరు (10): వైసీపీ-7, టీడీపీ-3
చిత్తూరు (14): టీడీపీ-6, వైసీపీ-8
అనంతపురం (14): టీడీపీ-12, వైసీపీ-2
కడప (10): వైసీపీ-9, టీడీపీ-1
కర్నూలు (14): టీడీపీ-3, వైసీపీ-11
ఆళ్లగడ్డలో మాత్రం దివంగత నేత శోభానాగిరెడ్డినే గెలిపించారు అక్కడి ప్రజలు. ఆమె చనిపోయినా, ఆమెకు ఓటేస్తే ఉపఎన్నికలు వస్తాయని తెలిసినా, ఓటు ద్వారా ఆమెకు నివాళులు అర్పించారు ఆళ్లగడ్డ ఓటర్లు.
కామెంట్ను పోస్ట్ చేయండి