ఎన్నాళ్లుగానో పార్టీలను ఉత్కంఠకు గురి చేస్తున్న స్థానిక సంస్థల ఫలితాల్లో తొలి భాగమైన పురఫలితాలు స్పష్టమైన తీర్పును చెప్పాయి... సీమాంధ్రలో టీడీపీ స్పష్టమైన ఆధిపత్యాన్ని ప్రదర్శించింది. పుర ఫలితాలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న వైసీపీ నాయకత్వాన్ని మాత్రం పట్టణ ఓటర్లు తీవ్రంగా నిరాశ పరిచారు. సీమాంధ్రలో మొత్తం 62 మున్సిపాలిటీలను టీడీపీ కైవసం చేసుకోగా, వైసీపీ 19 మున్సిపాలిటీలను మాత్రమే దక్కించుకుంది. వైఎస్ జగన్ సొంత జిల్లా కడపలోనూ ఐదు మున్సిపాలిటీలను టీడీపీ దక్కించుకోవడం విశేషం. ఇక కాంగ్రెస్ ఒక్కచోటా ఖాతా తెరవకపోవడం ఆ పార్టీ దయనీయ స్థితికి అద్దం పడుతోంది. 11 మున్సిపాలిటీల్లో మాత్రం హంగ్ ఏర్పడింది. కార్పొరేషన్లలోనూ సైకిల్ జోరు కొనసాగింది. ఏడు కార్పొరేషన్లలో ఐదు కార్పొరేషన్లు ..రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, చిత్తూరు, అనంతపురాన్ని టీడీపీ దక్కించుకుంది. కడప, నెల్లూరు కార్పొరేషన్లు మాత్రమే వైసీపీకి దక్కాయి.
ఇక తెలంగాణ విషయానికి వస్తే కారు జోరుకు హస్తం అడ్డుగా నిలిచింది. మున్సిపాలిటీల్లో సింహభాగం కాంగ్రెస్ పార్టీకే దక్కి, ఆ పార్టీలో ఉత్సాహాన్ని నింపాయి. 21 మున్సిపాలిటీలను కాంగ్రెస్ దక్కించుకోగా, టీడీపీ రెండు, టీఆర్ఎస్ 8 మున్సిపాలిటిల్లో అధికారాన్ని అందుకున్నాయి. అయితే, ఈ సారి ఆశ్చర్యకరంగా, బీఎస్పీ రెండు మున్సిపాలిటీలను దక్కించుకోవడం విశేషం. ఎంఐఎం భైంసా మున్సిపాలిటీలో జయకేతనం ఎగరవేసింది. తెలంగాణలో మూడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా.. కరీంనగర్ కార్పొరేషన్లో మాత్రమే గులాబీ జెండా ఎగిరింది. నిజామాబాద్, రామగుండంలో హస్తం హవానే నడిచింది.
ఇక తెలంగాణ విషయానికి వస్తే కారు జోరుకు హస్తం అడ్డుగా నిలిచింది. మున్సిపాలిటీల్లో సింహభాగం కాంగ్రెస్ పార్టీకే దక్కి, ఆ పార్టీలో ఉత్సాహాన్ని నింపాయి. 21 మున్సిపాలిటీలను కాంగ్రెస్ దక్కించుకోగా, టీడీపీ రెండు, టీఆర్ఎస్ 8 మున్సిపాలిటిల్లో అధికారాన్ని అందుకున్నాయి. అయితే, ఈ సారి ఆశ్చర్యకరంగా, బీఎస్పీ రెండు మున్సిపాలిటీలను దక్కించుకోవడం విశేషం. ఎంఐఎం భైంసా మున్సిపాలిటీలో జయకేతనం ఎగరవేసింది. తెలంగాణలో మూడు కార్పొరేషన్లకు ఎన్నికలు జరగ్గా.. కరీంనగర్ కార్పొరేషన్లో మాత్రమే గులాబీ జెండా ఎగిరింది. నిజామాబాద్, రామగుండంలో హస్తం హవానే నడిచింది.
కామెంట్ను పోస్ట్ చేయండి