రాష్ట్రపతి దేశానికి ప్రథమ పౌరుడు. దేశాన్ని ముందుకు నడిపించాల్సిన నాయకుడు. 120 కోట్ల మంది జనానికి ఆదర్శంగా ఉండాల్సిన మహానుభావుడు. ఆ పదవిని ఎంతో మంది అధిష్టించినా చకచకా నిర్ణయాలు తీసుకుంటూ తనదైన ముద్రవేసిన ఘనత ప్రస్తుత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీదే. మిగిలిన రాష్ట్రపతులకు తాను పూర్తి భిన్నమని ఆయన చేతలు ఎన్నోసార్లు నిరూపించాయి. ఇప్పుడు కూడా అలాంటిదే మరో పని చేయబోయి ఎందుకో విరమించుకున్నారాయన. అదే ఓటు హక్కు వినియోగం...
సాధారణ ఎన్నికల్లో ఓటు వేయడం భారత పౌరుల విధి. విధిని సరిగా నిర్వర్తించలేని వాడికి హక్కులు కోరే అధికారం ఉండదు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఓటు వేయాలంటూ భారీగా ప్రకటనలు ఇస్తూనే ఉంది. దానికి తగ్గట్లే ఈ సారి కూడా చాలామంది ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే, ఈసారి రాష్ట్రపతి మాత్రం ఓటు వేయడం లేదు. తటస్థంగా ఉండాలన్న ఉద్దేశంతో ఓటు వేయడం లేదంటూ రాష్ట్రపతి భవన్ ధృవీకరించింది. వాస్తవానికి ఆయన బ్యాలెట్ ఓటు వేయాలని నిర్ణయించుకుని అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కానీ, చివరి నిమిషంలో మాత్రం ఇతర రాష్ట్రపతుల్లా ఓటు వేయకుండా ఉండడమే మంచిదని భావించారట.
దేశ ప్రథమ పౌరుడే ఓటేయకపోతే, మిగిలిన జనం ఓటెలా వేస్తారు.. ? ఏ పార్టీకి ఓటేయాలన్నది వ్యక్తిగత విషయం. దాన్ని అధికారిక వ్యవహారాలతో ముడి పెట్టడం ఎంతవరకూ సమంజసం. రాష్ట్రపతి అయినంతమాత్రాన ఆయన కాంగ్రెస్ వ్యక్తి కాకపోతారా.. ఒకవేళ అంత కాదనుకుంటే, ఈ సారి నుంచి నోటా ను కూడా ఈసీ అందుబాటులోకి తెచ్చింది కదా.. కనీసం అదన్నా వేసి ఓటు గౌరవాన్ని కాపాడవచ్చు కదా.. అంతేకాని, నేను ఓటేయనంటే.. జనం కూడా మాకేంటి అనుకోరూ.. ప్రణబ్ జీ ఓటేయండి.. దేశ ప్రజలకు ఆదర్శంగా నిలవండి.
సాధారణ ఎన్నికల్లో ఓటు వేయడం భారత పౌరుల విధి. విధిని సరిగా నిర్వర్తించలేని వాడికి హక్కులు కోరే అధికారం ఉండదు. ప్రభుత్వ యంత్రాంగం మొత్తం ఓటు వేయాలంటూ భారీగా ప్రకటనలు ఇస్తూనే ఉంది. దానికి తగ్గట్లే ఈ సారి కూడా చాలామంది ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే, ఈసారి రాష్ట్రపతి మాత్రం ఓటు వేయడం లేదు. తటస్థంగా ఉండాలన్న ఉద్దేశంతో ఓటు వేయడం లేదంటూ రాష్ట్రపతి భవన్ ధృవీకరించింది. వాస్తవానికి ఆయన బ్యాలెట్ ఓటు వేయాలని నిర్ణయించుకుని అందుకు తగ్గ ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. కానీ, చివరి నిమిషంలో మాత్రం ఇతర రాష్ట్రపతుల్లా ఓటు వేయకుండా ఉండడమే మంచిదని భావించారట.
దేశ ప్రథమ పౌరుడే ఓటేయకపోతే, మిగిలిన జనం ఓటెలా వేస్తారు.. ? ఏ పార్టీకి ఓటేయాలన్నది వ్యక్తిగత విషయం. దాన్ని అధికారిక వ్యవహారాలతో ముడి పెట్టడం ఎంతవరకూ సమంజసం. రాష్ట్రపతి అయినంతమాత్రాన ఆయన కాంగ్రెస్ వ్యక్తి కాకపోతారా.. ఒకవేళ అంత కాదనుకుంటే, ఈ సారి నుంచి నోటా ను కూడా ఈసీ అందుబాటులోకి తెచ్చింది కదా.. కనీసం అదన్నా వేసి ఓటు గౌరవాన్ని కాపాడవచ్చు కదా.. అంతేకాని, నేను ఓటేయనంటే.. జనం కూడా మాకేంటి అనుకోరూ.. ప్రణబ్ జీ ఓటేయండి.. దేశ ప్రజలకు ఆదర్శంగా నిలవండి.
కామెంట్ను పోస్ట్ చేయండి